వజ్రాల వ్యాపారికి నిరవ్ మోడీకి వేల కోట్ల రూపాయల రుణాలను ఇచ్చి.. అప్పులఊబిలోకి కూరుకుపోయిన పంజాబ్ నేషనల్ బ్యాంకును ఆదుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకోనుందా.? అంటే ఔనన్న సంకేతాలే కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమై.. వారి మనన్నలను పొందిన ఆంధ్రా బ్యాంకు.. పూర్తిగా తన ఉనికినే కొల్పోనుంది. ఈ బ్యాంకు ఒక్కటే కాదు.. తెలుగు ప్రజల కాసింత ఆదరణ పోందిన ఓబిసి (ఒరియెంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్) బ్యాంకుతో పాటు అలహాబాద్ బ్యాంకులు కూడా తమ ఉనికిని కొల్పోనున్నాయి.
అదెలా అంటే రాష్ట్రాల స్థాయిలో నడిచే బ్యాంకులు ఇక జాతీయ బ్యాంకుల్లో విలీనం కానున్నాయి. ఇందులో భాగంగా మరో మూడు చిన్న బ్యాంకులు విలీనం కానున్నాయి. వచ్చే మూడు నెలల్లో స్టేట్ రన్ బ్యాంకులను పీఎన్ బీ ఏకీకృతం చేయనున్నట్టు రాయిటర్స్ నివేదిక వెల్లడించింది. ఒబిసి బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, అలహాబాద్ బ్యాంకులను ఢిల్లీ ఆధారిత బ్యాంకు పీఎన్ బీలో విలీనం కానున్నట్టు నివేదిక తెలిపింది. ఏప్రిల్ నెలలో యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ ఇండియా బ్యాంకులు పీఎన్ బి బ్యాంకులో విలీనం అవుతాయని వార్తలు వచ్చాయి. కానీ, మరో మూడు కొత్త బ్యాంకులు విలీనం కానున్నట్టు రాయిటర్స్ నివేదిక పేర్కొంది.
ఈ మూడు బ్యాంకులను పీఎన్ బీ.. తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రాసెస్ స్టార్ట్ చేసినట్టు తెలిపింది. రాష్ట్ర స్థాయి బ్యాంకింగ్ సెక్టార్ లో అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు భారత ప్రభుత్వం.. చిన్న స్థాయి బ్యాంకు రంగాలను విలీనం చేయాలనే యోచనలో ఉన్నట్టు రాయిటర్స్ వర్గాలు తెలిపాయి. మూడు బ్యాంకుల విలీనం విషయంలో పీఎన్ బీ నుంచి గానీ లేదా ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. 2019 ఏడాదిలో ఏప్రిల్ నెలలో పీఎన్ బీలో మూడు బ్యాంకులు డెనా బ్యాంకు, విజయ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా విలీనం అయిన సంగతి తెలిసిందే. దేశంలోనే అతిపెద్ద స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తర్వాత రెండో అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంకు పీఎన్ బీలో 9వేల 500 బ్రాంచ్ లు, 13వేల 400 ఏటీఎంలు, 85వేల ఉద్యోగులు ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more