భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రగ్యాసింగ్ ఠాకూర్ కు మధ్యప్రదేశ్ లోని కమల్ నాథ్ సర్కార్ షాకిచ్చేందుకు రెడీ అవుతోంది. 2007లో సునీల్ జోషి అనే ఆరెస్సెస్ ప్రచారక్ దారుణ హత్యకు గురైన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నాయకుడి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ జోషి.. అరెస్టు నుంచి తప్పించుకునే క్రమంలో దుండగులు ఆయనను కాల్చి చంపారు. ఈ కేసులో ప్రగ్యాసింగ్ నిందితురాలిగా ఉన్న విషయం కూడా తెలిసిందే. దీంతో ఆరెస్సెస్ ప్రచారక్ హత్యకేసును రీఓపెన్ చేసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ప్రగ్యా సింగ్ సహా మరో ఏడుగురికి ఈ హత్యతో సంబంధం ఉన్నట్లుగా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు లభించని కారణంగా 2017లో కోర్టు వీరిని నిర్దోషులుగా తేల్చింది. ప్రస్థుత పరిణామాల సందర్భంగా ఈ కేసును తిరగదోడాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయం గురించి రాష్ట్ర న్యాయశాఖా మంత్రి పీసీ శర్మ మాట్లాడుతూ.. సునీల్ జోషి హత్య కేసును తిరిగి ఓపెన్ చేసేందుకు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కేసు తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఈ కేసులో దేవాస్ కలెక్టర్ తన సొంత నిర్ణయాల మేరకు కేసును మూసి వేశారని, ఉన్నత న్యాయస్థానానికి వెళ్లకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు. ఈ కేసు ఫైల్ ను సమర్పించాల్సిందిగా కలెక్టర్ ను ఆదేశించామని తెలిపారు. సునీల్ జోషి హత్యకేసు తిరగదోడటంపై బీజేపీ అధికార ప్రతినిధి రజనీశ్ అగర్వాల్ స్పందించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్పై ప్రగ్యా పోటీ చేసినందుకు ఆమెపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more