హైదరాబాదుతో ఏళ్లుగా పెనువేసుకున్న బంధాన్ని వదిలేసి అమరావతికి బయలుదేరే ప్రభుత్వ ఉద్యోగులల్లో ఎంతటి భావోద్వేగం వుందో మనకు తెలిసిందే. తాజాగా హైకోర్టు విభజన నేపథ్యంలోనూ న్యాయవాదులు అంతే బాధతో హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివెళ్లారు. అయితే ఇప్పటికీ పలువురు ఇంకా ఇక్కడే విధుల్లో కోనసాగుతున్నారు. వారిలో ఒకరు కానిస్టేబుల్ మధు. హైదరాబాద్ లో విధులు నిర్వర్తిస్తున్న మధును తాజాగా అధికారులు విజయవాడ బదిలీ చేశారు. ఇందులో పెద్ద వింతేముంది అంటారా.?
అయితే, అతను అమరావతికి వెళ్లదిలేదని మారాం చేస్తున్నారు. కొంతకాలం వేచిచూసిన పోలీసులు మధుకు పదే పదే చెప్పినా.. అతను వెళ్లడానికి విముఖత చూపుతున్నాడు. ఇక లాభంలేధని భావించిన పోలీసులు అతడ్ని బలవంతంగా జీపులో విజయవాడకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. జీపు సరిగ్గా ఖైరతాబాద్ చౌరస్తాకు రాగానే.. సిగ్నల్ పడటంతో మధు జీపు నుంచి దూకి పరుగందుకున్నాడు. జీపు నుంచి దూకిన మధును నలుగురు పోలీసులు తిరిగి బలవంతంగా జీపులోకి ఎక్కించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.
తనను వదిలేయాలంటూ అతడు ప్రాధేయపడ్డాడు. దీంతో అతనికి, వారికీ మధ్య వాగ్వివాదం, పెనుగులాట జరిగాయి. దీంతో విస్తుపోవడం వాహనదారుల వంతైంది. పోలీసు జీపు నుంచి దూకింది ఎవరు.? ఎందుకు పోలీసులు లాక్కెళ్లుతున్నారో అర్థం కాలేదు. అతనెవరు.? ఎందుకు అతడిని బలవంతంగా జీపులోకి ఎక్కిస్తున్నారు? అని అడిగారు. ఈ ఘటనకు సంబంధించిన దృష్యాలను మొబైల్ లో వీడియో చిత్రీకరించడంతో ఎందుకొచ్చిన గొడవని భావించిన పోలీసులు అతడిని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇక, జీపు నుంచి దూకిన కానిస్టేబుల్ మధును ఏం జరిగిందని వాహనదారులు ప్రశ్నించారు. తాను ఏపీఎస్పీ 11వ బెటాలియన్ కానిస్టేబుల్ నని చెప్పుకొచ్చాడు. తనను బలవంతంగా విజయవాడ తరలించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాడు. చాలా మంది అంధ్రప్రదేశ్ కానిస్టేబుళ్లు అక్కడ విధులు నిర్వహిస్తుండగా, తనను మాత్రమే టార్గెట్ గా చేసిన అధికారులు బదిలీ చేశారని చెప్పకోచ్చాడు. కాగా, స్థానికులు తాము తీసిన వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది వైరల్ అవుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more