తెలంగాణ పదోతరగతి పరీక్ష ఫలితాలల్లో యధావిధిగా మరోమారు అమ్మాయిలే టాప్ రేపారు. సచివాలయంలోని డీ- బ్లాక్ మీటింగ్ హాల్ లో విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఈ పలితాలను విడుదల చేశారు. టెన్త్ పరీక్షలకు 5 లక్షలకు పైగా విద్యార్థులు హాజరుకాగా, 92.43 శాతం ఉత్తీర్ణత నమోదైందని ఆయన అన్నారు. ఎప్పటిలానే బాలికలు ముందు నిలిచారని, పరీక్షలు రాసిన బాలికల్లో 93.68 శాతం, బాలురలో 91.18 ఉత్తీర్ణత నమోదైందన్నారు. ఇక పదోతరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలు కూడా దుంధ:భి మ్రోగించాయి. 1580 ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన చెప్పారు.
జిల్లాల వారీగా జగిత్యాల జిల్లా అగ్రస్థానంలో నిలువగా, హైదరాబాద్ ఆఖరు స్థానంలో నిలిచిందని జనార్థన్ రెడ్డి వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో పరీక్షలు రాసిన వారిలో 99.30 శాతం మంది పాస్ కాగా, 89.09 శాతం ఉత్తీర్ణతతో హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచిందని తెలిపారు. సిద్ధిపేట రెండో స్థానం, కరీంనగర్ మూడో స్థానంలో నిలిచింది. 10వ తరగతి ఫలితాలపై ఫిర్యాదు కోసం ప్రత్యేక యాప్ రూపొందించినట్లు వెల్లడించారు. ఇక వచ్చే నెల 10 నుంచి 24 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, ఈ నెల 27వ తేదీలోగా పరీక్ష రుసుం చెల్లించాల్సి వుంటుందని ఆయన వెల్లడించారు.
- బీసీ వెల్ఫేర్ 98.78 శాతంతో టాప్లో నిలిచింది.
- గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 98.54 శాతంతో రెండో స్థానంలో ఉంది.
- మోడల్ స్కూళ్లలో 15 వేల 434 అందులో 98.45 శాతం పాస్ అయ్యారు.
- 11 వేల 026 స్కూళ్లలో 4 వేల 374 స్కూళ్లలో వంద శాతం ఫలితాలు వచ్చాయి.
- 15 వందల 80 జిల్లా పరిషత్ స్కూళ్లలో వంద శాతం ఫలితాలు వచ్చాయి.
- 5 వేల ప్రైవేటు స్కూళ్లలో 2 వేల 279 స్కూళ్లలో నూటికి నూరు శాతం ఫలితలు వచ్చాయి.
* అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జూన్ 10వ తేదీ 24వ జూన్ వరకు నిర్వహిస్తారు.
* మే 27వ తేదీ చివరి తేదీ.
* ఎస్బీఐ చలాన్ల ద్వారా ఫీజు కట్టేందుకు లాస్ట్ డేట్ మే 29.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more