ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరోసారి సీఎం పదవి దక్కించుకోవాలని పట్టదలగా ఉన్న ఆయన తన ఎన్నికల ప్రచారంలో యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. యువతపై, ముఖ్యంగా నిరుద్యోగ యువతపై హామీల వర్షం కురిపిస్తున్నారు. మరోసారి టీడీపీని గెలిపిస్తే నిరుద్యోగ భృతిని పెంచుతామని, ఇంటర్ పూర్తైన తరువాతి నుంచే భృతిని కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు.
వెయ్యి రూపాయలతో ప్రారంభించి నిరుద్యోగ భృతిని రూ.2వేలు చేశామని, భవిష్యత్తులో అది రూ.3వేలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతేకాదు ఇకపై ఇంటర్ పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు నిరుద్యోగ భృతి అందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు డిగ్రీ చదివిన వారికి మాత్రమే నిరుద్యోగ భృతి ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లా అద్దంకిలో టీడీపీ ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు.
డ్వాక్రా మహిళల కోసం ఐదేళ్ల వ్యవధిలో 3 పర్యాయాలు పసుపు-కుంకుమ నిధులు అందజేస్తామని, వారికి అండగా ఉంటామని చంద్రబాబు వాగ్దానం చేశారు. పండుగ సమయాల్లో 2 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. కోటిమందికి స్మార్ట్ ఫోన్లు అందజేస్తామన్నారు. చంద్రన్నా, ఈ సమస్య ఉందంటూ ఆ ఫోన్ లో ఒక్క బటన్ నొక్కితే ఆ పని పూర్తిచేసే బాధ్యత తనదే అని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చెప్పింది చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులను ఆదుకునేందుకు నిధులు విడుదల చేస్తామని చంద్రబాబు తెలిపారు.
ఏపీలో 12లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు అంచనా. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి నిరుద్యోగ భృతి అందిస్తున్నారు. నెలకు రూ.2000 నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఇప్పటి వరకు డిగ్రీ, అంతకంటే ఎక్కువ చదివిన నిరుద్యోగులకు మాత్రమే ఇస్తున్న నిరుద్యోగ భృతిని ఇకపై ఇంటర్ చదివిన వారికి కూడా ఇస్తామని చంద్రబాబు ప్రకటించడం విశేషం. ఓటర్లను అట్రాక్ట్ చేసేందుకు చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. హామీల వర్షం కురిపిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more