తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి యూటర్న్ తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లటం రమారమి ఖారారు చేసుకుని చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి తన తనయుడు కార్తీక్ రెడ్డిని బరిలోకి దింపాలని భావించిన అమె చివరాఖరు క్షణంలో వెనక్కుతగ్గినట్లు సమాచారం. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కేటీఆర్ తో కలసి స్వయంగా చర్చలు జరిసిన మాజీ మంత్రి.. కార్యకర్తలు, అనుయాయువులతో కూడా భేటీ అయ్యి నిర్ణయం ప్రకటించనున్న క్రమంలో అమె తన నిర్ణయాన్ని పున:సమీక్షించుకున్నారు.
అధికార పార్టీలోకి చేరిన పక్షంలో తన తనయుడు కార్తిక్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ అబ్యర్థిగా ఖారారు చేయడంతో పాటు అమెకు కూడా మంత్రి పదవి ఇస్తామని టీఆర్ఎస్ వర్గాల నుంచి స్పష్టమైన హామీ కూడా లభించినట్లు సమాచారం. దీంతో అమె చేరిక ఇక లాంఛనమే అని భావిస్తున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎంట్రీతో మొత్తం కథ మారిపోయింది. సీనియర్ నేతగా వున్న సబిత పార్టీ మారితే తెలంగాణ కాంగ్రెస్ కు కోలుకోని దెబ్బ అంటూ.. అప్రమత్తమైన కాంగ్రెస్.. అమెతో దశలవారీగా చర్చలు జరిపారు.
కాంగ్రెస్ పార్టీలో ఆమెతో పాటు కుమారుడికి కూడా సముచిత స్థానం ఉంటుందని హామీలు ఇచ్చారు. స్టేట్ కాంగ్రెస్ నేతల హామీలపై ఏమంతగా నమ్మకంలేని సబితా.. పార్టీ మారేందుకు సిద్ధం అయ్యారు. అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న రేవంత్.. ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రాహుల్ గాంధీ సబితారెడ్డితో నిన్న రాత్రి ఫోన్ ద్వారా సంబాషించారని, అమెను హస్తినకు కూడా రమ్మని అహ్వానించారని సమాచారం.
స్వయంగా జాతీయ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచనలతో వెనక్కు తగ్గిన సబిత, తన కుమారుడు కార్తిక్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు. వీరితోపాటు రేవంత్ రెడ్డి కూడా వెళుతున్నారు. సబితా ఇంద్రారెడ్డి ప్రస్తుతానికి పార్టీ మారే ఆలోచనను వాయిదా వేసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు అన్నట్లు.. రాజకీయాల్లో ఎప్పుడు.. ఏమైనా జరగొచ్చు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత సబితా తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు ఆసక్తిగా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more