వివాదాస్పద అయోధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు కొత్తతరహా నేపథ్యానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు శ్రీకారం చుట్టింది. రామ జన్మభూమి, బాబ్రీ మసీదు భూమి ఎవరికి చెందినది అన్న అంశంలో రెండు వర్గాలకు మధ్య ఎంతోకాలంగా నానుతూ వస్తున్న ఈ భూ-సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కోర్టు సమక్షంలో మధ్యవర్తిత్వానికి అప్పగించాలని నిర్ణయించింది. అత్యంత జఠిలంగా వున్న ఈ భూసమస్యను కేవలం మధ్యవర్తిత్వం మాత్రమే పరిష్కరించగలదని న్యాయస్థానం అభిప్రాయపడింది.
అయితే ఎనమిది వారాల్లోగా మధ్యవర్తిత్వ ప్రక్రియను పూర్తిచేసి.. తమకు నివేదికను అందజేయాలని కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం డెడ్ లైన్ విధించింది. మధ్యవర్తిత్వ నిర్ణయంపై దేశప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నప్పటికీ వాటిని పక్కనబెట్టిన ధర్మాసనం ముగ్గురు సభ్యులతో కూడిన మధ్యవర్తిత్వ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఈ త్రిసభ్య ఫ్యానెల్ కమిటీలో జస్టిస్ జస్టిస్ ఎఫ్ఎమ్ఐ ఖలిఫుల్లా, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచుతో పాటుగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ లు వున్నారు.
ఈ కమిటీకి చైర్ పర్శన్ గా జస్టిస్ ఎఫ్ఎమ్ఐ ఖలిఫుల్లా వ్యవహరించనున్నారు. కాగా, మధ్యవర్తిత్వ ప్రొసీడింగ్స్ ను ఎనమిది వారాల్లోగా పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించినప్పటికీ.. నాలుగు వారాల తరువాత తమ మధ్యవర్తిత్వ ప్రోసీడింగ్ ఎలా సాగుతున్నాయన్న విషయమై మధ్యవర్తిత్వ కమిటీ స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లోనే ఈ కమిటీ ప్రొసీడింగ్స్ అన్నీ జరగాలని, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీనికి అనుగుణంగా అవసరమైన ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది.
మధ్యవర్తిత్వ ప్రొసీడింగ్స్ అన్నీ కాన్ఫిడెన్షియల్ గా కెమెరా సమక్షంలోనే జరగాలని కోర్టు సూచించింది. ఈ కేసు కేవలం ఆస్తి తగాదా మాత్రమే కాదని..రెండు మతాలకు, విశ్వాసాలకు సంబంధించిన విషయమని,మొఘల్ రాజ్ బాబర్ ఏం చేశారు, ఆ తర్వాత ఏం జరిగిందనే దానితో తమకు సంబంధం లేదనీ... ఇప్పుడు ఏం జరుగుతుందన్న దానిపైనే తాము దృష్టిపెట్టగలమని సమస్య పరిష్కారానికి ఎక్కువ మంది మధ్యవర్తులు అవసరమని తాము భావిస్తున్నట్లు ఈ కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more