అంతర్జాతీయ సమాజం ముందు తీవ్రవాదులను ప్రోత్సహించిన దేశంగా పాకిస్థాన్ ను భారత్ తాజా సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో దోషిగా నిలబెట్టినా.. దాయాధి మాత్రం ఓ వైపు శాంతిమంత్రాన్ని జపిస్తూనే.. తాము ఉగ్రవాదులకు ఎంతటి సర్గధామంగా నిలుస్తున్నారో మరోమారు స్పష్టమైంది. బాలాకోట్ లో జైషే మొహమ్మద్ ఉగ్ర స్థావరాలను భారత వాయుసేన ధ్వంసం చేయడంతో ఖంగుతిన్న పాక్.. ఈ సారి ఏకంగా తమ సైనిక స్థావరాలకు సమీపంలోనే ఉగ్రవాద స్థావరాలను ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంది.
ఒకేసారి ఏకంగా 300 మంది ఉగ్రవాదలను హతమార్చిన తరువాత కూడా భారత్ సరిహద్దులో తధేకంగా కాల్పుల విరమణ ఒప్పందాలకు తిలోదకాలిస్తూ.. భారత భూభాగంపైకి మోటార్లతో కాల్పులకు తెగబడుతున్న దాయాధి.. ఇక ఉగ్రవాద క్యాంపులను తుడిచిపెట్టేలా నిర్ణయాలు తీసుకోకుండా వాటిని ప్రోత్సహించేందుకు పాకిస్తాన్ అర్మీ చర్యలు తీసుకుంటుందని భారత నిఘావర్గాలు సమగ్ర నివేదికను రూపోందించాయి. ఈ నివేదిక ప్రకారం పాకిస్థాన్ లో మొత్తంగా 16 ఉగ్రవాద స్థావరాలను ఇంకా యాక్టివ్ గానే వున్నాయని తెలిపింది.
పాకిస్థాన్ ప్రధాన భూభాగం, పాక్ ఆక్రమిత కశ్మీరులలో 16 టెర్రర్ క్యాంపులు ఇప్పటికీ యాక్టివ్ గా ఉన్నాయని భారత నిఘావర్గాల నివేదికలో స్పష్టమైంది. ఈ టెర్రర్ క్యాంపులన్నీ పాకిస్థాన్ సైనిక స్థావరాలకు దగ్గర్లోనే ఉన్నాయని కూడా నివేదికలో నిఘావర్గాలు తెలిపాయి. ఇవి దోడ్డిదారిన భారత్ సరిహద్దులో కాల్పులకు తెగబడుతూ.. భారత భూభాగంలోకి చోరబాట్లకు కూడా యత్నించే అవకాశాలు వున్నాయని కూడా నిఘావర్గాల సమాచారం. మరీ ముఖ్యంగా ఈ 16 టెర్రర్ క్యాంపుల్లో 11 పాక్ ఆక్రమిత కశ్మీరులో ఉండటం గమనార్హం.
ఈ 11 స్థావరాల్లో 5 స్థావరాలు ముజఫరాబాద్, కోట్లీ, బర్నాలా ప్రాంతాల్లో ఉన్నాయి. మిగిలిన ఐదు స్థావరాలు పాకిస్థాన్ ప్రధాన భూభాగంలో ఉన్నాయి. మన్షెరాలో మూడు, పంజాబ్ (పాక్)లో రెండు స్థావరాలు యాక్టివ్ గా ఉన్నాయి. వీటి ట్రైనింగ్ సెంటర్లలో ఉగ్రవాదులకు కమెండో తరహా శిక్షణ ఇస్తున్నారు. ఐఈడీ బ్లాస్ట్, స్నైపర్ అటాక్, నీటి కింద భాగంలో పోరాటం, డ్రోన్ ఆపరేషన్ తదితర అంశాల్లో ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారు.
ఈ ఉగ్రవాద క్యాంపుల నుంచి 2018లో కనీసం 560 మంది టెర్రరిస్టులు భారత్ పై దాడులకు తెగబడేందుకు శిక్షణ పొందారు. శాంతి మంత్రం జపిస్తున్న పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలను తమ ఆర్మీ క్యాంపులకు సమీపంలోనే ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ఆధారాలతో సహా అంతర్జాతీయ సమాజం ముందు ఉంచేందుకు భారత్ యోచిస్తుంది. పాక్ లోని ఉగ్రస్థావరాల శాటిలైట్ చిత్రాలను ప్రపంచ దేశాలకు అందజేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more