టీడీపీ కార్యకర్తలకు చెందిన డేటాను తెలంగాణ పోలీసులతో కలసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీ విపక్ష నేత జగన్ కు ఇప్పించిందని అరోపిస్తున్న అధికార టీడీపీ పార్టీ.. తమ కార్యకర్తల డేటాను భద్రపర్చిన ఐటీ గ్రిడ్ సంస్థపై తెలంగాణ పోలీసులు టార్గెట్ చేసిన క్రమంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా తమ టార్గెట్ లపై కేసులు నమోదు చేస్తున్నారు. ప్రతిపక్ష వైసీపీని ఫోకస్ చేస్తూ, దానికి మద్దతుగా నిలిచిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐప్యాక్ సంస్థపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు టార్గెట్ చేశారు.
ప్రశాంత్ కిషోర్ ఐఫ్యాక్ సంస్థపై 4 కేసులు నమోదు చేశారు. ఐప్యాక్ నిర్వహించే సోషల్ మీడియా అకౌంట్స్ పై ఆంక్షలు విధించారు. వాటిపై కూడా కొన్ని కేసులు నమోదు చేశారు. దీంతో వీలైనంతవరకూ ప్రశాంత్ కిషోర్ ఐఫ్యాక్ నుంచీ వైసీపీకి మద్దతు లేకుండా చేయాలని అధికార పార్టీ భావించే ఇలాంటి చర్యలకు పూనుకుందన్న అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. దేశంలోని చాలా రాజకీయ పార్టీలకు ఎన్నికల కన్సల్టెంట్ గా పనిచేస్తూ... ఆయా పార్టీలు ఎన్నికల్లో విజయం సాధించేందుకు తీసుకోవాల్సిన సలహాలు, సూచనలను అందజేసే ఐప్యాక్ సంస్థలను ఏపీ పోలీసులు ఎందుక టార్గెట్ చేశారన్నది అసలు ప్రశ్న.
ఐప్యాక్ సంస్థ సర్వేలు చేస్తూ... ఏ అభ్యర్థి పరిస్థితి ఎలా ఉంది, ఏ నియోజకవర్గంలో ఏ రాజకీయ పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది అనే అంచనాలతో రిపోర్టులు ఇస్తుంటుంది. ప్రస్తుతం ఐప్యాక్... వైసీపీకి రాజకీయ అంశాల్లో సహాయం చేస్తోంది. రెండేళ్లుగా ఆ పార్టీకి సలహాలు, సూచనలూ ఇస్తున్నారు ప్రశాంత్ కిషోర్. జగన్ పాదయాత్రను సక్సెస్ ఫుల్ చేసిన ప్రశాంత్ కిషోర్... తాజాగా అన్న పిలుపు, సమర శంఖారావం వంటి సభల సంగతి చూసుకుంటున్నారు. గతేడాది బీహార్ వెళ్లిన ప్రశాంత్ కిషోర్... ఏపీ రాజకీయాలపై ఫోకస్ తగ్గించారు. ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో దృష్టి సారిస్తున్నారు.
తాజాగా డేటా చోరీ కేసులో టీడీపీ కుట్రపన్ని, ఓటర్ల జాబితా నుంచీ వైసీపీ మద్దతు దారుల పేర్లను తొలగిస్తోందన్న ప్రచారం చేయించడం వెనక ప్రశాంత్ కిషోరే ఉన్నట్లు టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంత ప్రయత్నిస్తున్నా... ఈ కేసు నుంచీ తప్పించుకోవడం టీడీపీకి సవాలేనని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తుండటంతో... ఎదురుదాడి ద్వారా తాము ఏ తప్పూ చెయ్యలేదనీ, అంతా ప్రశాంత్ కిషోర్ చేస్తున్న అసత్య ప్రచారమేనని ప్రజలు భావించేలా చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఐప్యాక్పై కేసులు పెట్టి... ఇరికించేందుకు యత్నిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more