లోక్ సభకు జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలు ఎన్నికల షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం మరోమారు స్పష్టం చేసింది. ప్రస్తుతం దాయాధి దేశం పాకిస్తాన్ ఉగ్రమూకల జమ్మూలోని పూల్వామాలో మానవబాంబు దాడికి పాల్పడి.. బీభత్సం సృష్టించని నేపథ్యంలో భారత్ వాయుసేన దళాలు పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిభిరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య నెలకోన్న ఉద్రిక్త పరిస్థితులు సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తలపై స్వయంగా కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా స్పందించారు. దాయాధి దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సార్వత్రిక ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపబోవని ఆయన తెలిపారు. ఎన్నికల షెడ్యూలులో ఎటువంటి మార్పు ఉండదని, అనుకున్న ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికలు సజావుగా సాగే అవకాశం ఉందా? అన్న మీడియా ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానమిచ్చారు.
ఎన్నికల సన్నాహాల్లో భాగంగా రెండు రోజులుగా అరోరా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు స్వదేశంతోపాటు విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుందన్నారు. వారిచ్చిన సమాచారాన్ని ఐటీ విభాగం నిర్ధారిస్తుందని, తేడాలుంటే చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపేందుకు ఈసీ కట్టుబడి ఉందన్న అరోరా.. ఉద్వేగ, రెచ్చగొట్టే ప్రసంగాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more