శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. మార్చి 7 వరకు 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మాడవీధ్లులో భ్రమరాంభికా, మల్లిఖార్జున స్వామి వార్లకు రేపటి నుంచి వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు వాహనసేవలకు కూడా మాడవీధుల్లో అన్ని ఏర్పాట్లు చేశారు.
సోమవారం యాగశాల ప్రవేశంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. దేవస్థానం ఈవో, ఆలయ అర్చకులు, వేదపండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు సాయంకాలార్చనలు, అగ్నిప్రతిష్ఠాపన, అంకురారోపణ, త్రిశూలపూజ, భేరీపూజ.. రాత్రి ధ్వజారోహణ కార్యక్రమాలు ఉంటాయి. మంగళవారం (ఫిబ్రవరి 26 నుంచి) ప్రతి రోజూ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లకు వాహనసేవ, గ్రామోత్సవం నిర్వహిస్తారు.
28న టీటీడీ ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ ఉంటుంది. మార్చి 1న రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పిస్తారు. మహాశివరాత్రి పర్వదినంనాడైన స్వామివారికి లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. మార్చి 5న రథోత్సవం, తెప్పోత్సవం నిర్వహిస్తారు. మార్చి 1వరకు శివమాల స్వీకరించి జ్యోతిర్ముడి ధరించిన భక్తులకు మాత్రమే స్పర్శ దర్శనం ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.
26న స్వామిఅమ్మవారు భృంగివాహనంపై దర్శనమిస్తారు. 27న హంసçవాహనం, 28న మయూర వాహనం, మార్చి 1న రావణవాహనం, 2న పుష్పపల్లకీ మహోత్సవం, 3న గజవాహనం, 4న ప్రభోత్సవం, నందివాహనసేవ, 5న రథోత్సవం, 6న పూర్ణాహుతి, ధ్వజావరోహణ, 7న అశ్వవాహన సేవలు ఉంటాయి. ఈ బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి సైతం భక్తులు భారీగా తరలి వస్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more