TDP MLA Amanchi Krishna Mohan quits party టీడీపీ పార్టీకి చీరాల ఎమ్మెల్యే ఆమంచి రాజీనామా

Mla from chirala amanchi krishna mohan resigned tdp to join ysrcp

Amanchi Krishnamohan resigns TDP, Amanchi Krishnamohan to join YSRCP, Amanchi Krishnamohan Chirala MLA, Amanchi Krishnamohan vs Karanam Balaram, Amanchi Krishnamohan Prakasam, TDP, YSRCP, chirala, Karanam Balaram, Prakasam, Andhra Pradesh, Politics

TDP MLA Amanchi Krishnamohan from Chirala has resigned to the TDP and is likely to join YSRCP. He has sent his resignation letter to TDP president and chief minister N Chandrababu. Amanchi has met YSRCP chief YS Jagan Mohan Reddy at Lotus Pond.

ఫలించని బాబు దౌత్యం.. వైసీపీ గూటికి చేరుకోనున్న ఆమంచి..

Posted: 02/13/2019 12:55 PM IST
Mla from chirala amanchi krishna mohan resigned tdp to join ysrcp

తెలుగుదేశం పార్టీ నుంచి వీడిపోతున్న నేతలకు, పార్టీలో వర్గాలతో, అగ్రనాయకులు అధిపత్యాలతో ఇన్నాళ్లు ఇబ్బందులను ఎదుర్కొన్నా.. ఇక చివరిక్షణంలో మాత్రం పొసగక పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇలాంటి నేతలకు పార్టీ అధినేత చంద్రబాబు వారు పార్టీలోనే వుండేలా చర్యలు తీసుకోవాలని సీనియర్ నేతలను దౌత్యానికి కుదిర్చినా ఆ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఇక లాభం లేదని తానే స్వయంగా నేతలతో చర్చించినా తాత్కాలికంగా వాయిదా పడుతుందే కానీ ఫిరాయింపులు మాత్రం ఆగడం లేదు.

తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేత పార్టీని వీడటంతో భారీ ఎదురుదెబ్బ తగిలింది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే ఆమంచి టీడీపీని వీడుతారంటూ గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. దీంతో, అధినేత చంద్రబాబు అయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. మంత్రి శిద్ధా రాఘరావును ఆమంచి వద్దకు దూతగా పంపారు. అనంతరం, సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే కృష్ణమోహన్‌‌ కలిసినా, ఆయన నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.

టీడీపీకి రాజీనామా చేసిన ఆమంచి, తన లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు పంపారు. అంతకు ముందు తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన ఆమంచి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కాసేపట్లో లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత జగన్‌ను కలిసి పార్టీలో చేరనున్నారు. చీరాల నియోజకవర్గంలో వర్గపోరు తారాస్థాయికి చేరడంతో ఆమంచి టీడీపీని వీడుతున్నట్టు ఆయన అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆమంచి, ఎమ్మెల్సీ పోతుల సునీత వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. చీరాలలో రెండు గ్రూపులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని, అందులో భాగంగానే పోతుల సునీతకు పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమించిందనే అసంతృప్తి ఆమంచి వర్గీయుల్లో నెలకొంది. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించిన ఆమంచి కృష్ణమోహన్ తర్వాత టీడీపీలో చేరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amanchi Krishnamohan  TDP  YSRCP  chirala  Karanam Balaram  Prakasam  Andhra Pradesh  Politics  

Other Articles