లడ్డూ, పులిహోరా, దద్దోజనం, వడ, చక్కెర పొంగలి, చివరకు బిస్మిల్లా బాత్ కూడా ఆలయాల్లో ప్రసాదంగా అందిస్తుండటం మనం విన్నాం. కానీ ఏకంగా మాంసాహారాన్ని ఆలయాల్లో ప్రసాదంగా అందిస్తారా.? అంటే ఇలాంటి కొన్ని వింతలు కూడా వుంటాయన్నది నగ్నసత్యం. తమిళనాడులోని ఓ దేవాలయంలో మద్యాన్ని భక్తులు దేవుడికి సమర్పించే విషయాన్ని విన్నాం. మరీ ఇప్పడు అదే రాష్ట్రంలో నోరూరించే మటన్ బిర్యానీని ప్రసాదంగా పెడతారు. ఔనా అంటూ ఆశ్చర్యపోతున్నారా.? కానీ ఇది నిజం.
తమిళనాడులోని మదురై జిల్లా తిరుమంగళం తాలుకా వడక్కంపట్టి గ్రామంలో మునియండి అనే దేవాలయం ఉంది. ఈ ఆలయంలో మునియండి స్వామి కొలువుదీరారు. ఆ స్వామికి బిర్యానీ ప్రియుడు అని పేరు అందుకే దేవాలయంలో ఉత్సవాల సందర్భంగా బిర్యానీనే భక్తులకు ప్రసాదంగా పెడతామని ఆర్గనైజర్ మునీశ్వరస్వామి తెలిపారు.మధురై నగరానికి 45 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ దేవాలయంలో ప్రతి ఏటా జనవరి మూడో వారంలో వచ్చే శుక్ర, శని, అదివారాల్లో ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి.
ఈ మునియండీ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం 5 గంటలకే మటన్ బిర్యానీ ప్రసాదంగా పెడతారు. అంత పొద్దున బిర్యానీ తినడమే ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆచారం 84 ఏళ్లుగా కొనసాగుతోంది. 2వేల కిలోల బాస్మతి రైస్, దానికి సరిపడా మటన్తో బిర్యానీ తయారు చేసి భక్తులందరికీ అందజేస్తారు. అక్కడ దేవుడి పేరు మీద ప్రారంభించిన ‘శ్రీ మునియండి విలాస్’ బిర్యానీ హోటల్ కూడా చాలా ఫేమస్. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో ‘శ్రీ మునియండి విలాస్’ పేరుతో దాదాపు వెయ్యి బ్రాంచీలున్నాయి. ఈ హాటళ్ల నిర్వాహకుల విరాళాలు, వాటిలోని కస్టమర్లు ఇచ్చే విరాళాలతో మునియండీ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
Tamil Nadu: Biryani is served as 'prasad' at Muniyandi Swami temple in Vadakkampatti, Madurai. A devotee says,'I come here every yr,we're celebrating this festival for last 84 yrs.Around 1000 kg rice,250 goats&300 chickens are used to make biryani, we use public donations for it' pic.twitter.com/6ZYEIlKZkt
— ANI (@ANI) January 26, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more