దేశసర్వోన్నత న్యాయస్థానం అవకాశం కల్పించడంతో శబరిమల ఆలయ ఆచారాలను పట్టించుకోకుండా నిషిద్ద వయస్సు గల ఇద్దరు మహిళలు దేవాలయంలోకి ప్రవేశించి స్వామి అయ్యప్ప దర్శనం చేసుకున్న విషయం యావత్ దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. కాగా ఆ ఇద్దరు మహిళలు కనకదుర్గ, బిందులకు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వాన్ని తాజాగా ఆదేశించింది.
దేవాలయంలోకి ప్రవేశించిన నేపథ్యంలో తమను చంపుతామని, దాడులు చేస్తామని కొందరు బహిరంగంగా ప్రకటించడం, ఇక వీరి చర్యపై హింధూ సంఘాలు కూడా భగ్గుమనడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయాందోళన మధ్య తామున్నామని, తమకు రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని ఈ ఇద్దరు దాఖలు చేసుకున్న పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. ఈ అంశంపై ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు... వారిద్దరికి తగిన భద్రత కల్పించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
జనవరి 2న బిందు, కనకదుర్గలు.. శబరిమల వెళ్లి అయ్యప్పను దర్శించుకున్న తరువాత హిందూ సంఘాలు, పలువురి ప్రకటనల నేపథ్యంలో వారు ఏకంగా వారం రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా పోయారు. అయితే మంగళవారం అత్తింటికి వచ్చిన కనకదుర్గపై ఆమె అత్త దాడి చేయడం కలకలం రేపింది. ఈ దాడిలో గాయపడిన కనకదుర్గను ఆస్పత్రికి తరలించారు. తమపై మరోసారి దాడి జరిగే అవకాశం ఉందని భావిస్తున్న ఇద్దరి మహిళలు... తమకు భద్రత కల్పించేలా ప్రభుత్వాలను ఆదేశించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇదిలావుండగా, కేరళ ప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టుకు ఓ సంచలన విషయాన్ని వెలువరించింది. సెప్టెంబర్ 28న అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించిన తరువాత తొలిసారిగా అడ్వకేట్ బింధు అమ్మిని, పౌర సరఫరాల ఉద్యోగిని కనకదుర్గల ఆలయంలోకి ప్రవేశించిన తరువాత ఇప్పటి వరకు ఏకంగా 51 మంది నిషిద్ద వయస్సు మహిళలు ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానం ముందు వివరాలను వెల్లడించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more