బీఫ్ వండుకున్నారనే కారణంగా గ్రామస్థులపై దాడులు చేయడం, బీఫ్ విక్రయిస్తున్నవారిని చితకబాదడం వంటి సంఘటనలు కొన్నిరోజుల కిందట వెలుగుచూసిన సంగతి తెలిసిందే. అయితే వాటన్నింటికీ విభిన్నమైనదీ సంఘటన. పెళ్లి విందులో ‘బీఫ్’ కచ్ఛితంగా వడ్డించాలని డిమాండ్ చేసినందుకు, వరుడితో వివాహాన్నే క్యాన్సిల్ చేసుకుందో వధువు. అలాగని ఆ అమ్మాయి హిందు కుటుంబానికి చెందినది కూడా కాదు. ఓ ముస్లీం యువతి. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ సిటీకి దగ్గర్లో ఉన్న సిసౌటా గ్రామానికి చెందిన అస్గర్ అలీ తన కూమార్తెను, అదే గ్రామానికి చెందిన నసీం అలీ కుమారుడైన నజీమ్కు ఇచ్చి నిఖా జరిపించేందుకు నిర్ణయించారు. నిశ్చితార్థం కూడా నిర్వహించి... వరుడికి ఉంగరం తొడిగి, పెళ్లి బట్టలు కూడా మార్చుకున్నారు. ఈ నెల 28న పెళ్లి జరిపించాలని నిఖాకి ముహుర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. అయితే పెళ్లి విందులో బీఫ్ పెట్టాలని వరుడు నజీమ్, వధువు కుటుంబీకులను డిమాండ్ చేశాడు. రూ. 5 లక్షలు కట్నం, కారు కట్నంగా ఇవ్వాలని కోరాడు.
కట్నం, కారు ఇచ్చేందుకు ఒప్పుకున్న వధువు కుటుంబం, బీఫ్ వడ్డించేందుకు మాత్రం ససేమీరా అనేసింది. అయితే బీఫ్ కచ్చితంగా ఉండాల్సిందే అని వరుడి కుటుంబం డిమాండ్ చేయడంతో... పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు ప్రకటించింది వధువు. నిఖాకి ముహుర్తం పెట్టుకున్న తర్వాత వింత కోరికలు కోరిన వరుడి కుటుంబీకులపై వధువు తండ్రి అస్గర్ ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు. యోగి ఆదిత్యానాథ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఉత్తరప్రదేశ్పై బీఫ్పై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని నజీమ్ కుటుంబీకులు చెబుతుండడం విశేషం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more