Emotions, nostalgia run high on eve of HC bifurcation అటు భావోద్వేగం.. ఇటు వీడ్కోల పర్వం..

Lawyers became emotional while moving to amaravati from hyderabad

Hyderabad high court bifurcation, AP High Court, Andhra Pradesh High Court, Amaravati, Telangana High Court, Lawyers Emotional moments hyderabad, Vijayawada, Telangana, Andhra Pradesh, amravati

Decades of a love–hate relationship among lawyers from Andhra Pradesh and Telangana culminated in an ‘affectionate separation’, as members of the fraternity from Andhra Pradesh moved out of Hyderabad on Monday.

ఆంధ్ర న్యాయవాదుల భావోద్వేగం.. తెలంగాణ లాయర్ల వీడ్కోల పర్వం..

Posted: 12/31/2018 08:27 PM IST
Lawyers became emotional while moving to amaravati from hyderabad

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు అధ్యాయం సోమవారం (డిసెంబర్ 31)తో ముగిసింది. జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ హైకోర్టులు వేర్వేరుగా పనిచేయనున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి అమరావతికి 900 మంది ఉద్యోగులు బస్సుల్లో బయలుదేరారు. అంతకుముందు వీరికి తెలంగాణ న్యాయవాదులు, సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ప్రవీణ్‌కుమార్ నియమితులయ్యారు. జస్టిస్ టీబీ రాధాకృష్ణన్‌ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువరించారు. తెలంగాణ హైకోర్టుకు 13 మంది, ఏపీ హైకోర్టుకు 16 మంది న్యాయమూర్తులను కేటాయించారు.

హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాక 1956 నవంబర్ 5న హైదరాబాద్‌లో హైకోర్టును ఏర్పాటు చేశారు. నాటి నుంచి ఉమ్మడి ఏపీకి ఇది సేవలందించింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా సేవలందించింది. ప్రతి రాష్ర్టానికి హైకోర్టు ఉండాలని చెబుతున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 214తో పాటు ఏపీ పునర్విభజన చట్టం - 2014 ప్రకారం, హైకోర్టును విభజిస్తూ ఇటీవల ప్రకటన వెలువరించారు.

ఏపీకి ఆ రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొనగా.. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఉమ్మడి హైకోర్టును తెలంగాణ రాష్ట్ర హైకోర్టుగా గుర్తించారు. జనవరి 1 నుంచి అందులోనే తెలంగాణ కార్యకలాపాలు కొనసాగుతాయని, అమరావతిలోని నేలపాడులో నిర్మిస్తున్న తాత్కాలిక హైకోర్టు నూతన భవనాల్లో ఏపీ హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. దీంతో దశాబ్దాల ఉమ్మడి హైకోర్టు ప్రస్థానం ముగిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles