రైల్వే క్రాసింగ్ల వద్ద గేట్లు వేయకపోతే జరిగే నష్టం అందరికీ తెలిసిందే. సరిగ్గా నాలుగేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రంలో చిన్నారులను తీసుకెళ్తున్న స్కూల్ బస్సు.. పట్టాలపైకి వెళ్లగానే అటుగా దూసుకువచ్చిన రైలు ఢీకొనడంతో జరిగిన విషాదం ఇప్పటికీ ఆ కుటుంబాలను వేధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదే కాదు అనేక చోట్ల ఇలా మానవరహిత రైల్వే క్రాసింగ్ ల వద్ద జరిగే ప్రమాదాలు సృష్టించిన విషాదాలు మరెన్నో.
రైల్వే క్రాసింగ్ కాపలా కొరవడడంతో అనేకమంది వాహనదారులు గమనించకుండా ముందుకు పోయి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇలాంటి కొన్ని తీవ్రమైన ఘటనల దృష్ట్యా ప్రస్తుతం రైల్వే గేట్ల వద్ద కాపలా ఏర్పాట్లను పటిష్ఠం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాల్లోనూ ఉంది. అందుకు సాక్ష్యమే ఈ వీడియో!
అమెరికాలోని ఇల్లినాయిస్ లో పోలీసు అధికారిగా సేవలందిస్తున్న పీటర్ తన పోలీసు పెట్రోలింగ్ కారు నడుపుకొంటూ వెళ్తున్నాడు. ఓ రైల్వే క్రాసింగ్ వద్ద ఎలాంటి కాపలా లేదు. రైలు వచ్చే సమయంలో గేటు కూడా వేయలేదు. తన ముందు వెళ్తున్న కారునే గమనిస్తూ వెళ్తున్న ఆయన.. ఒక్కసారిగా పక్క నుంచి వస్తున్న రైలును చూశాడు. వేగంగా వెళ్తున్న రైలు పట్టాలకు రెండు మూడు అడుగుల చేరువకున్న విషయాన్ని గ్రహించిన ఆయన తన కారును అమాతం పక్కకు తిప్పేశాడు. ఇలా రైలు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు.
ఈ వీడియోను ఆయన ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తూ.. ‘‘పుట్టుకతోనే నాకు అసలు అదృష్టం లేదని అనుకునేవాణ్ని. కానీ నాకు ఇప్పుడే తెలిసింది.. నేను చాలా అదృష్టవంతుడినని! ఇన్నాళ్లూ నాకు లభించని అదృష్టం మొత్తం కలిసి ఇప్పుడు నాకు సరైన సమయంలో ఒకేసారి దొరికింది. ఇక నాకు భవిష్యత్తులో ఏ అదృష్టమూ అక్కర్లేదు. దీంతోనే సంతృప్తిగా ఉంటాను.’’ అని పీటర్ రాశారు. ఈ వీడియో ఫేస్ బుక్ లో సంచలనంగా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more