పెథాయ్ తుపాను ప్రభావానికి తోడు, ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల తీవ్రతతో తెలుగు రాష్ట్రాలు గజగజలాడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో గత నాలుగు రోజులుగా చలిగాలులు వీస్తూ.. రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. బయటకు రావాలంటే కూడా జనం జంకుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో మంగళవారం మేఘం కమ్మేయగా, సూర్యుడు కూడా దర్శనం ఇవ్వకుండానే వెళ్లిపోయాడు. పొగమంచు దట్టంగా దాపురించడంలో ప్రయాణికులకు పట్టపగటు కూడా లైట్లు వేసుకుని వెళ్లాల్సిన అవసరం వాహనదారులకు వచ్చింది.
చలి తీవ్రతకు తట్టుకోలేక ఇప్పటివరకు తెలంగాణ, ఏపీలలో 34 మంది ప్రాణాలు వదిలారు. ఆంధ్రప్రదేశ్ లో 23 మంది, తెలంగాణలో 11 మంది చలి కారణంగా మరణించారు. ఒక్క విశాఖ జిల్లాలోనే ఆరుగురు మృత్యువాత పడగా, ప్రకాశంలో ఐదుగురు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున చనిపోయారు. పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. తెలంగాణలోని 11 మరణాలు సంభవించగా.. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలో దాసరి వాడకు చెందిన రెండ్ల పెద్ద యాదగిరి (75) శీతల గాలుల తీవ్రతను తట్టుకోలేక చనిపోయాడు.
కాగా, హైదరాబాద్ లో పగటి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకన్నా తక్కువకు, రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల దిగువకు పడిపోయాయి. పొగమంచు వల్ల విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పలు విమాన సర్వీసులను ఆలస్యంగా నడుపుతున్నారు. ఇది ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తున్నా, పరిస్థితుల వల్ల తప్పట్లేదని విమానాశ్రయ అధికారులు పేర్కొంటున్నారు. ఇక రానున్న మూడు, నాలుగు రోజుల్లో చలి పులి తన పంజాను మరింత బలంగా విసరనుందని అధికారులు హెచ్చరించారు.
తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రజలు బయటకు వెళ్లాలని చెబుతున్న వైద్యాధికారులు.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తప్పని సరిగా స్వెటర్లు, జాకెట్లు వాడాలనీ, చిన్న పిల్లలు, ముసలివాళ్లు తప్పని సరిగా ఉన్ని వస్త్రాలు వేసుకోవాలని తెలిపారు. ఆస్తమా రోగులు, చిన్న పిల్లలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని హెచ్చరిస్తున్నారు. చలి గాలుల వల్ల స్వైన్ఫ్లూ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, వ్యాధి భారిన పడకుండా జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more