తిరుమల శ్రీవారి వివిధ ఆర్జిత సేవలకు సంబంధించి మార్చి నెల కోటా కింద 70,512 టికెట్లను టీటీడీ శుక్రవారం విడుదల చేసింది. వీటిలో 11,537 సేవా టిక్కెట్లు ఆన్లైన్ డిప్ విధానం ద్వారా కేటాయిస్తారు. ఈ టిక్కెట్ల కోసం శుక్రవారం ఉదయం 10 గంటల నుంచే పేర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైనట్టు అధికారులు వెల్లడించారు. వీటిలో అత్యధికంగా సుప్రభాత సేవకు 8,182, తోమాలసేవ 120, అర్చన 120, అష్టదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం 2,875 టికెట్లు ఉన్నాయి.
ఇక, జనరల్ కేటగిరిలో 58,975 టికెట్లు విడుదల కాగా వీటిలో విశేషపూజ 2 వేలు, కల్యాణోత్సవం 14,725, ఊంజలసేవ 4,650, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 14,300, సహస్ర దీపాలంకరణ సేవ 15,600 వంతున అందుబాటులోకి ఉన్నట్టు వెల్లడించారు. ఆన్లైన్ డిప్ కోసం డిసెంబరు 11 మధ్యాహ్నం 12 గంటల వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా టిక్కెట్లను కేటాయిస్తారు. టికెట్లు లభించిన భక్తులు డిసెంబరు 14 మధ్యాహ్నం 12 గంటల్లోపు నగదు చెల్లించాలి.
శ్రీవారి సేవా టికెట్ల కేటాయింపులో టీటీడీ కీలక మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పాత విధానంలోని లోపాలను అక్రమార్కులు అక్రమార్జనకు తెరలేపిన క్రమంలో టీటీడీ కొత్త నిబంధనలు రూపొందించింది. విజిలెన్స్ విభాగం సిఫార్సుల మేరకు రూపొందించిన తాజా నిబంధనలు నవంబర్ నెలలో విడుదల చేసిన సేవా టికెట్లకు వర్తింపజేసింది. కొత్త నిబంధన ప్రకారం.. ఒక మెయిల్ ఐడీ, ఒక ఫోన్ నెంబరుతో మాత్రమే బుక్ చేసుకోవాలి. గతంలో ఈ విధానం లేకపోవడంతో వందలాది నకిలీ ఐడీలతో పేరు నమోదు చేసుకోవడం, ఎలక్ట్రానిక్ లాటరీ విధానంలో టిక్కెట్లు దక్కించుకుని, వాటిని ఇతరులకు అమ్ముకొని సొమ్ము చేసుకోవడం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more