ఒక రాష్ట్రం కోసం ఉద్యమాలు జరిగినపుడు, రామ మందిరం కోసం ఉద్యమాలు జరిగినపుడు, జన్మనిచ్చిన తల్లుల రిజర్వేషన్ కోసం ఎందుకు పోరాటం చేయరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో పాసు కావడానికి ఇంకా ఎన్నేళ్ల పాటు ప్రసవ వేధను అనుభవించాలని ఆయన నిలదీశారు. అమలాపురంలో జరిగిన డ్వాక్రా మహిళల మీటింగ్ లో ప్రశ్నించారు. విలువలు, బాధ్యతతో కూడిన ఆడపడుచులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా వుందని ఆయన పిలుపునిచ్చారు.
నిజాయితీ కలిగిన మహిళలు రాజకీయాల్లోకి రాకపోతే సమాజంలో అవినీతి, అన్యాయం, అక్రమాలు, అలజడులు పెరిగిపోతాయని ఆయన అందోళన వ్యక్తం చేశారు. అయితే అడపడచులు రాజకీయాల్లో రాకపోతే.. చంద్రబాబు, జగన్, లోకేష్ వంటివాళ్లు పెరిగిపోయి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేస్తారని హెచ్చరించారు. అందుకే మహిళలకు నిత్యం అండగా నిలిచే జనసేన.. వారి అభ్యున్నతి కోసం 33 శాతం రిజర్వేషన్ కోసం జనసేన పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు.
జన్మనిచ్చే ఆడవాళ్లు సాక్షాత్తు దైవసమానులు, అలాంటి ఆడపడుచులకు సరైన గౌరవం ఇవ్వకపోతే సమాజం విచ్చిన్నం అయిపోతుందని పేర్కోన్నారు. బూతులు తిట్టేవారు, నోరేసుకుని పడిపోయేవారు మహిళా నాయకులు కాదు, విలువలు మాట్లాడేవారు, సమస్యలు అర్థం చేసుకునేవాళ్లు, మానవత్వంతో వ్యవహరించేవారు అర్థులను అమ్మలా అదరించే వాళ్లే నిజమైన మహిళా నాయకులు అని వ్యాఖ్యానించారు. మగవాళ్ల ఆధిపత్యంలో రాజకీయాలు అవినీతిమయం అయిపోయాయని అన్నారు. జనసేన పార్టీ తరపున విలువలు, బాధ్యతతో కూడిన ఆడపడుచులను రాజకీయాలలోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా పవన్ అన్నారు.
ఇక మరో సందర్బంలో.. పచ్చటి కోనసీమ కాలుష్యకాసారంగా మారడంపై ఆయన మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో ఆయిల్ కంపెనీలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. ప్రకృతి అందాలకు కేరాఫ్ గా మారిన కోనసీమను.. బీడు భూమిగా మార్చేశారని విమర్శించారు. ఇక్కడ చోటుచేసుకున్న అవినీతికి గ్యాస్ ప్రమాదాలే ప్రత్యక్ష సాక్ష్యమని వ్యాఖ్యానించింది. అధికారుల అవినీతి, ఆయిల్ కంపెనీల నిర్లక్ష్యానికి వందలాది మంది కోనసీమ ప్రజలు ఇప్పటివరకూ ప్రాణాలు కోల్పోయారని విమర్శించింది. ఈ ఘటనకు సంబంధించిన శతాఘ్ని మిస్సైల్ పేరున ఓ వీడియోను జనసేన పార్టీకి విడుదల చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more