రైలు అంటే కూడా ఏంటో తెలియని ఏడాది వయస్సున్న చిన్నారి.. రైలు పట్టాలపై పడినా.. అంతలోనే రైలు కదిలినా.. ఏ మాత్రం గాయాలపాలు కాకుండా మృత్యుంజయురాలిగా మళ్లీ తన తల్లి ఓడిలోకి చేరిన ఘటన ఇది. రైలు దిగుతున్న తల్లి చేతుల్లోంచి అకస్మాత్తుగా చిన్నారి జారిపోయి.. రైల్వే పట్టాలపై పడిపోయింది. అంతలోనే ఆ రైలు కదలిపోయింది. కొన్ని బోగీలు ఆమెపై నుంచి వెళ్లిపోయాయి. అయితే, ఆ చిన్నారికి ఏమాత్రం గాయలుకాలేదు సరికదా.. రైలు వెళ్లగానే చిన్నారి అదిరోపేయే బదులు నవ్వుతూ నేను మృత్యుంజయరాలిని అని సందేశాన్నిచ్చింది.
ఈ సంఘటన ఉత్తర్ప్రదేశ్లోని మథుర రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. ఇందతా అక్కడ సీసీటీవీల్లో రికార్డు కావడంతో ప్రస్తుతం వైరల్గా మారింది. ఢిల్లీ- విశాఖ సమతా ఎక్స్ప్రెస్ రైల్లో మథురకు చెందిన సోను దంపతులు తమ పాప సాహిబాతో కలిసి ఆగ్రాకు చేరుకున్నారు. ఒకటో నెంబరు ప్లాట్ ఫాంపై రైలు ఆగడంతో అందులో నుంచి దిగేందుకు ప్రయత్నించారు. ఓవైపు ప్రయాణీకులు రద్దీ ఎక్కువగా ఉండటం, ఇంతలో రైలు కదలడంతో ఎవరో పాప తల్లిని వెనుక నుంచి నెట్టేశారు. దీంతో చేతిలో ఉన్న చిన్నారి జారిపడి ట్రాక్పై పడిపోయింది. ఇంతలో రైలు కదలడంతో బోగీలు ఆమె మీదుగా వెళ్లిపోయాయి.
సాహిబా తల్లిదండ్రులతోపాటు అక్కడ ప్రయాణికులంతా ఈ హఠార్పిరిణామానికి నిర్ఘాంతపోయారు. పాప జీవించివుంటుందన్న విషయంలో వారు ఆశలు వదిలేసి రైలు వెళ్లిపోయే వరకు అంతా అలా ఉత్సవవిగ్రహఆల మాదిరిగానే నిలబడిపోయారు. అయితే, రైలు ఆమెను దాటివెళ్లిపోగా, పట్టాలపై దృశ్యం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. చిన్నపాటి గాయం కూడా కాకుండా పాప సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మృత్యువును జయించిన ఆ చిన్నారిని ఆశీర్వదించడానికి తోటి ప్రయాణికులు పోటీపడ్డారు. రైలు పట్టాలకు ప్లాట్ ఫాంకు మధ్య పాప పడటం, రైలు చక్రాలకు, చిన్నారికి మధ్య ఒక్క అంగుళం మాత్రమే దూరం ఉండటం గమనార్హం. దీనిపై పాప తండ్రి సోనూ మాట్లాడుతూ... తాము దిగేందుకు ప్రయత్నిస్తుండగా రైలు కదిలిపోయిందని అన్నారు. దీంతో తాను లగేజి తీసుకోగా, పాపను నా భార్య ఎత్తుకుని దిగుతుండగా వెనుక నుంచి ఎవరో నెట్టేయడంతో చేతుల్లో నుంచి సాహిబా జారిపోయిందని చెప్పారు.
అయితే పాపతో పాటు తమ అదృష్టం కూడా కలిసోచ్చి పట్టాల మధ్య పడిపోయిన పాప మృత్యుంజయురాలిగా తిరిగి తమ ఒడికి చేరిందని తెలిపారు. అసిఫ్ ఖాన్ అనే తోటి ప్రయాణికుడు దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. నాగ్ పూర్ వెళ్లేందుకు రైలు కోసం వేచి చూస్తుండగా ఇంతలో చిన్నారి పట్టాలపై పడిపోవడం తన కంటపడిందని పేర్కొన్నారు. అయితే, పాప ప్రాణాలతో బయటపడుతుందని ఎవరూ అనుకోలేదు కానీ, చిన్న గాయం కూడా కాకపోవడం అందరూ సంతోషించారని అన్నాడు. పాప చిన్నగాయమైనా కాకుండా ప్రాణాలతో బయటపడటం అద్భుతమని రైల్వే ఎస్ ఐ సీబీ ప్రసాద్ వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more