ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఓవైపు చంద్రబాబు గొప్ప వ్యక్తి అని చెబుతూనే... ఆయనపై సెటైర్లు వేశారు. ఆయన ఎప్పుడు స్నేహితుడిగా ఉంటారో, ఎప్పుడు ప్రత్యర్థిగా మారతారో చెప్పడం కష్టమని అన్నారు. చంద్రబాబుతో ప్రయాణం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ నుంచి ఏమీ ఆశించకుండా గత ఎన్నికలలో ఆ పార్టీకి మద్దతు ప్రకటించానని... కానీ, తాను ఆశించిన ప్రయోజనాలేమీ చూకూరలేదని విమర్శించారు.
చెన్నైలో సీనియర్ హీరో, రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన కమల్ హాసన్ ను కలసిన తరువాత ఆయన ఇవాళ చెన్నైలో మీడియాతో మాట్టాడుతూ ‘ఎల్లారుకుం వణక్కం' అంటూ తన ప్రసంగాన్ని తమిళంలో ప్రారంభించారు. ఏపీ విభజన సమస్యలపై మాట్లాడారు. ఈ సందర్భంగా తన పేరు పవన్ కల్యాణ్ అని, 2014లో జనసేన పార్టీని ప్రారంభించానని చెప్పారు. ఇరవై ఏళ్లు చెన్నైలో ఉన్నానని, తన తమిళంలో ఏవైనా తప్పులుంటే క్షమించాలని కోరారు. పొరుగు రాష్ట్రాల్లో కూడా తమ పార్టీ గొంతుకను వినిపించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ విభజన సమయంలో చోటుచేసుకున్న సంఘటనలను గుర్తుచేశారు.
మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి బాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడేందుకు అప్పట్లో ఏపీ విడిపోయిందని, అయితే తెలంగాణ విడిపోవడం మాత్రం ప్రత్యేక పరిస్థితుల మధ్య జరిగిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను ముక్కలు కావడానికి జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అవలంబిస్తున్న విధానాలనే కారణమని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఈ క్రమంలో అంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పిస్తుందన్న అశ, నమ్మకం, ఎన్నికల హామీ నేపధ్యంలో బీజేపిని సమర్థిస్తే.. ప్రత్యేక హోదా విషయంలో కూడా మాట తప్పారని పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు.
ఎన్నో ఆశలతో ఏపీలో చంద్రబాబును సమర్థించాం కానీ, టీడీపీ ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితి ఏపీని బాధిస్తోందని, అందుకే, రాజకీయాల్లో మార్పు రావాలని, దేశాలు, రాష్ట్రాలు తిరుగుతూ తన వంతు ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా జల్లికట్టు గురించి పవన్ ప్రస్తావించారు. ఈ క్రీడ కోసం తమిళులు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని, యువత ముందుకొస్తే ఎలాంటి మార్పు తీసుకురాగలదో చెప్పడానికి ఈ పోరాటమే నిదర్శనం అన్నారు. ఉత్తరాది ఆధిపత్యంపై దక్షిణాదిలో ఉద్యమం రావాలని పవన్ అభిప్రాయపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more