కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టులో ఇవాళ ఊరట లభించింది. బోఫోర్స్ కుంభకోణం కేసుపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏకంగా 13ఏళ్ల తరువాత ఈ కేసుపై పునర్విచారణ చేయాలని కోరడం చాలా అలస్యమైందని.. అయితే ఇదే కుంభకోణంలో అజయ్ అగర్వాల్ అనే న్యాయవాది, బీజేపి నేత వేసిన కేసును ఇప్పటికే విచారిస్తున్నామని అత్యున్నత న్యాయస్థానం పేర్కోంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట లభించినట్లైంది.
బోఫోర్స్ కుంభకోణంపై 2005 మే 31న ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ... సీబీఐ ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దశాబ్దకాలం పాటు ఈ కేసును వాదిస్తూ వచ్చిన బీజేపీ నేత, న్యాయవాది అజయ్ అగర్వాల్... హైకోర్టు తీర్పుపై 90 రోజుల్లోగా సీబీఐ సవాల్ చేయలేకపోవడంతో అదే ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్లో సీబీఐని కూడా తన ప్రతివాదిగా పేర్కొన్నారు. ఆయన పిటిషన్ ను సుప్రీంకోర్టు అంగీకరించగా.. ఇప్పటికీ అది పెండింగ్లో ఉంది.
ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ ప్రతివాదిగా స్పందిస్తుందా లేక ప్రత్యేక పిటిషన్ దాఖలు చేస్తుందా అన్నదానిపై పలు ఊహాగానాలు వెలువడ్డాయి. తీవ్ర తర్జనభర్జనల తర్వాత సుప్రీంకోర్టులో తాజా పిటిషన్ వేసేందుకు కేంద్రం సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు దశాబ్దకాలం తర్వాత బోఫోర్స్పై హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా పిటిషన్ వేయాలంటూ స్వయంగా అటార్నీ జనరల్ వేణుగోపాల్ సీబీఐకి సూచించినట్టు ఊహాగానాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే న్యాయ నిపుణులతో విస్తృత సంప్రదింపుల తర్వాత.. ‘‘కొన్ని ముఖ్యమైన పత్రాలు, ఆధారాలు’’ ఉన్నాయంటూ హైకోర్టు తీర్పును సీబీఐ సవాల్ చేసింది. బోఫోర్స్ కుంభకోణంపై తన దర్యాప్తును రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ధ్వంసం చేసిందంటూ 2017లో ప్రయివేటు డిటెక్టివ్ మిఖాయిల్ హార్ష్మాన్ ఆరోపించడంతో... ఇదే అదనుగా బోఫోర్స్ కేసును తిరగదోడేందుకు అటార్నీ జనరల్ వేణుగోపాల్ సీబీఐని ముందుకు తోసినట్టు చెబుతారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more