దేశంలో ఓ వైపు మీటూ ప్రకంపనలు కుదిపేస్తున్న క్రమంలో.. ఏకంగా కేంద్రమంత్రి ఎంజే అక్బర్ తన పదవిని త్యజించాల్సి వచ్చిన నేపథ్యంలో దేశంలోని మహిళామణులు గతంలో తాము ఎదుర్కోన్న లైంగిక దాడులను, లైంగిక వేధింపులను నిర్బయంగా వెల్లడిస్తున్నారు. ఇదే సమయంలో అటు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా సంచలనమైన తీర్పును వెలువరించింది.
ఇప్పటికే వ్యక్తి తన భార్య అయినా అమెకు ఇష్టంలేని సమయంలో సంబోగం చేసినా నేరమేనన్న వాదనలు తెరపైకి వస్తున్న క్రమంలో.. ఈ వాదనను బలపర్చేలా అత్యున్నత న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. ఓ మహిళ వ్యభిచారిణే అయినా, ఆమెకు ఇష్టం లేకుండా చేసే సంభోగం అత్యాచారం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. వ్యభిచారిణులు అయినా విటులను తిరస్కరించవచ్చని, ఆమె అంగీకరించకుండా కలిస్తే, రేప్ చేసినట్టేనని పేర్కొంది.
1997లో నమోదైన ఓ కేసు విచారణలో తుది తీర్పును ఇచ్చింది. అప్పట్లో తనపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారని ఓ వ్యభిచారిణి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ కేసులో కింది కోర్టు అమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది.. నిందితులను దోషులుగా పరిగణించి.. శిక్షలు విధించింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ నిందితులు ఢిల్లీ హైకోర్టును అశ్రయించారు. దాంతో ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు నిందితుకుల అనుకూలంగా తీర్పును వెలువరించింది.
కాగా, నిందితులు విధించిన శిక్షలు కూడా సగమే అమలయ్యాయి. దీంతో బాధితురాలు ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు లైంగిక కోరికను తీర్చుకునేందుకు యువతి అంగీకారం తప్పనిసరని, ఆమె అంగీకరించకుంటే, అది అత్యాచారమేనని స్పష్టం చేసింది. ఈ విషయంలో అమె వ్యభిచారిని అయినా అమె అయిష్టంతో జరిపే సంబోఘం అత్యాచారమేనని సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more