తెలంగాణలో డిసెంబర్ 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోరులో భాగంగా ప్రజాకూటమిలోని మిత్ర పార్టీల మధ్య అంతరాలు పెరుగుతున్నాయని వస్తున్న వార్తలను టీజేఎస్ అధినేత కోదండరామ్ తోసిపుచ్చారు. తాము ప్రజాకూటమిపై కోపంగా ఉన్నామని... మహాకూటమిపై నీలినీడలు కమ్ముకున్నాయని వినిపించిన వార్తలు సత్యదూరమని ఆయన అన్నారు. ఈ సత్యదూరపు వార్తలను సృష్టించి ప్రజలను అయోమయంలోకి నెట్టేదెవరో ప్రజలందరికి తెలుసున్నారు.
ప్రజా కూటమిలో ఎప్పుడు ప్రస్తావనకు రాని అంశాలను తెరపైకి తేవడం పట్ల అవేదన వ్యక్త చేశారు. తమ టీజేఎస్ పార్టీ ప్రజాకూటమిలోనే కొనసాగుతుందని కోదండరామ్ స్పష్టం చేశారు. సీట్ల సర్దుబాటు అంశంపై తాము ఎప్పుడూ, ఎక్కడా మాట్లాడలేదని చెప్పారు. మహాకూటమిలో పెద్దన్న పాత్ర కాంగ్రెస్ దే అని తెలిపారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగానే కూటమిని ఏర్పాటు చేశామని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పర్యటనలో వున్నందను హైదరాబాదులో జరిగిన ప్రజాకూటమి సమావేశానికి హాజరుకాలేకపోయారని కోదండరామ్ అన్నారు.
అనంతరం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ.. తెలంగాణలోని టీడీపీ నేతలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు నిలదీస్తున్నారని... ఏమీ చేయకుండానే మళ్లీ ఓట్లు అడిగేందుకు ఎందుకు వచ్చావంటూ ప్రశ్నిస్తున్నారని అన్నారు. తాము కన్నెర్ర చేస్తే కేసీఆర్ కుటుంబం కాలగర్భంలో కలసిపోతుందని చెప్పారు.
ఈ సందర్భంగా సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగానే తామంతా కూటమిగా ఏర్పడ్డామని చెప్పారు. తమ మేనిఫెస్టోను త్వరలోనే ప్రజల ముందుకు తీసుకొస్తామని తెలిపారు. విపక్ష నేతలను భయపెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజా కూటమిలో ఎలాంటి అభిప్రాయబేధాలు, వివాదాలు లేవని తేల్చిచెప్పారు. ఇక డిసెంబర్ లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది ప్రజాకూటమి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more