దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక అదేశాలను జారీ చేసింది. సీబిఐ చీఫ్ గా ఆయనపై అవినీతి అభియోగాలు నమోదయ్యాయన్న నేపథ్యంలో అయనపై కేంద్రం విధించిన బలవంతపు సెలవు వేటుపై రెండు వారాల్లోగా విచారణ పూర్తి చేసి నివేదికను తమకు అందజేయాలని అదేశించింది. ఈ నేపథ్యంలో సీవీసి తరపు న్యాయవాది మూడు వారాల సమయం కావాలని కోరగా, సుప్రీం ధర్మాసనం తొలుత కేవలం పది రోజుల సమయాన్ని కేటాయించగా, తరువాత రెండు వారాల సమయాన్ని ఇచ్చింది.
తనను బలవంతంగా సెలపుపై పంపేందుకు కేంద్రం చేపట్టిన చర్యలను సవాల్ చేస్తూ ఆలోక్ కుమార్ వర్మ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ఇవాళ సుప్రీం విచారించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ కె.ఎం. జోసెఫ్ లతో కూడిన సర్వోన్నత న్యాయస్థాన త్రిసభ్య ధర్మాసనం ఈ సందర్భంగా అటు కేంద్రానికి ఇటు సీబిఐ, సీవీసీలకు నోటీసులను అందజేసింది. ఈ సందర్బంగా అలోక్ వర్మపై జరిగే పూర్తి విచారణను మాజీ జడ్జి జస్టిస్ ఏకే పట్నాయక్ పర్యవేక్షణలోనే కొనసాగించాలని న్యాయస్థానం నిర్ణయించింది.
ఇక సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా నియమితులైన మన్నెం నాగేశ్వరరావు.. విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదని.. రోజువారీ కార్యకలాపాలు, పరిపాలనా పరమైన పర్యవేక్షణకు మాత్రమే పరిమితమవ్వాలని సూచిస్తూ అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం వెలువరించింది. ఈ నెల 23వ తేదీన సీబీఐ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నాగేశ్వరరావు తీసుకున్న నిర్ణయాలను సీల్డ్ కవర్ ద్వారా తమకు తెలియబరచాలని ధర్మాసనం అదేశాలను జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను 12వ తేదీకి వాయిదా వేసింది.
సీబీఐ డైరెక్టర్ స్థాయి వ్యక్తిని అర్థరాత్రి అనూహ్య నిర్ణయాలతో బలవంతంగా సెలవుపై వేళ్లాలని అదేశాలను జారీచేయడం ఏంటని ప్రశ్నించిన త్రిసభ్య ధర్మాసనం.. తద్వారా అనేక కేసులపై దీని ప్రభావం ఎందుకు ప్రభావితం చూపదో తెలపాలని అదేశించింది. అంతేకాదు.. చాలా సున్నితమైన, సంచలనాత్మకమైన కేసుల్లో సైతం మార్పుచేర్పులు చోటు చేసుకున్నాయని అలోక్ వర్మ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లన విషయం పట్ల కూడా వివరణ కోరింది.
నిబంధనల ప్రకారం ప్రధానమంత్రి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రతిపక్ష నాయకుడిచే ఏర్పడిన కమిటీ.. డైరెక్టర్ నియామకం చేపడుతుంది. మరోవైపు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా.. ఆలోక్ వర్మ, రాకేశ్ ఆస్తానాలను పంపించడంపై సిట్ వేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున ప్రశాంత్ భూషణ్ వేసిన పిటిషన్ ను కూడా ఆలోక్ వర్మ పిటిషన్ తో కలిపి ధర్మాసనం విచారించింది. రెండూ ఒకే అంశానికి చెందినవి కావడంతో రెంటినీ కలిపి విచారించి నవంబర్ 12కు వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more