నవ వధువుల చేతిలో ప్రాణాలను కోల్పోతున్న భర్తల గురించి ఎక్కడో చదివిందో.. లేక వినిందో తెలియదు కానీ.. తాను అదే తరహా ప్లాన్ వేసి.. తన భర్తను హత్యచేసి.. తాను మాత్రం తన ప్రియుడితో కలసి ఎంచక్కా జీవితాన్ని పంచుకోవచ్చు అని పథకాన్ని రచించుకున్న ఓ వివాహిత కళలు కడతేరాయి. అయితే ఎలాంటి నేరాలకు పాల్పడిన వారైనా ఇవాళ కాకపోతే రేపైనా చట్టానికి చిక్కక తప్పదన్న విషయాలను కూడా వీరి వినడమో లేక చదవడమో చేసింటే ఇలాంటి అలోచనలు వచ్చేవి కావు.
ప్రియుడితో కలసి భర్తను హతమార్చేందుకు ప్లాన్ వేసి విఫలమైన ఈ నవ వధువు ప్లాన్ తిరగబడి, పోలీసులకు చిక్కింది. చెన్నై శివార్లలో జరిగిన ఈ నాటకీయ పరిణామంపై పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కదిరవన్ (30)కు నెల రోజుల క్రితం తూత్తుకుడికి చెందిన అనిత (25)తో వివాహమైంది. ఆపై గత వారాంతంలో వారు సముద్ర తీరానికి వాహ్యాళికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరి బైకును అడ్డుకున్న ఇద్దరు కదిరవన్ పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అనిత ధరించిన 12 సవర్ల నగలు, రూ. 1000 తీసుకుని పరారయ్యారు.
తీవ్రగాయాలతో పడివున్న కదిరవన్ ను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించిన అనిత, తన భర్తపై ఎవరో గుర్తు తెలియని అగంతకులు దాడి చేశారని పోలీసులకు తానే స్వయంగా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. కదిరవన్ పై దాడి జరుగుతున్న సమయంలో అనిత ఏ మాత్రం చలనం లేకుండా, చూస్తుండిపోయినట్టు కనిపించడంతో, ఆమెను తమదైన శైలిలో విచారించారు. దీంతో ఆసలు నిజం బయటకు వచ్చింది.
కాలేజీలో చదువుతున్న సమయంలో జగన్ అనే యువకుడిని ప్రేమించానని చెప్పిన నవవధువు.. , అయితే, తాము పెళ్లి చేసుకోవాలని భావించిన సమయంలో తనకు కదిరవన్ తో పెళ్లి చేశారని చెప్పింది. దుండగుల దాడి జరిగినట్టుగా ప్లాన్ చేశానని, అతని హత్య తరువాత తామిద్దరమూ కలసి జీవిద్దామని భావించామని చెప్పింది. ఆమెను విచారించిన తరువాత పోలీసులు మధురైలో ఉన్న జగన్ ను కూడా అరెస్ట్ చేసి, ఇద్దరినీ కటకటాల వెనక్కు నెట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more