విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతల్లో జవాబుదారీతనం లేకుండా పోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను ఎలాంటి అవగాహన లేకుండా, ప్రజల భవిష్యత్ గురించి ఆలోచించకుండా విభజించారని విమర్శించారు. విభజన చట్టానికి ఆమోదం లభించడంతో రాత్రికి రాత్రి తెలంగాణలో కొన్ని బీసీ కులాలు ఓసీగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రశ్నించేవారే కరువయ్యారని వ్యాఖ్యానించారు.
ఇలాంటి నిర్ణయాల కారణంగా యువత భవిష్యత్తు అర్థరాత్రి నుంచి ప్రశ్నార్థకంగా మారిపోయిందని అవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. బీసీలు ఓసీలుగా మారిపోయినా, వందలాది మంది ఉపాధి కోల్పోయినా కేంద్రం నిర్ణయాన్ని ప్రశ్నించేవారే లేకపోయారని పవన్ తెలిపారు. ఈ విషయాలపై అటు రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సి వున్నా పట్టించుకున్నదే లేదని దుయ్యబట్టారు.
అధికారం కోసం ప్రజల జీవితాన్ని అస్తవ్యస్తం చేయకుండా ఉండేందుకు రాజకీయాల్లో జవాబుదారీతనం కోసమే తాను జనసేనను స్థాపించానని వెల్లడించారు. సీఎం కార్యాలయం, మంత్రుల ఇళ్లపై ఢిల్లీలో జరిగినట్లు తనిఖీలు జరిపితే తాము ఏపీ ప్రభుత్వానికి అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ఎక్కడో గుంటూరు, కడప జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఫ్యాక్టరీలపై జరిగే వాటిపై తాము స్పందించబోమని తేల్చిచెప్పారు. నాదెండ్ల మనోహర్, తనది ఒకేరకమైన ఆలోచనా విధానమని పవన్ అన్నారు.
ఇక జనసేనలో చేరిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నాదేండ్ల మనోహర్ మాట్లాడుతూ జనసైనికుడిగా కష్టపడి పని చేసేందుకు పార్టీలో చేరానని అన్నారు. పవన్ కల్యాణ్ ఆలోచనా విధానం, అంకిత భావం గురించి, సమాజానికి ఏవిధంగా మేలు చేయాలనే ఆయన తపన గురించి చాలా తక్కువ మందికి తెలుసని అన్నారు. రాజకీయాల్లో అంకిత భావంతో పని చేయాలనే ఉద్దేశ్యం ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారని, అటువంటి వ్యక్తుల్లో పవన్ కూడా ఒకరని కొనియాడారు.
పవన్ అడుగుజాడల్లో నడవడం మనందరి అదృష్టమని అన్నారు. రాజకీయ మార్పుల గురించి ఎవరూ ఊహించలేమని, ఒక్కోసారి మార్పులు లేకుండా అలానే ఉండవచ్చని అభిప్రాయపడ్డ మనోహర్, కన్వీనెంట్ పాలిటిక్స్ ఈరోజు ఎక్కువైపోయాయని, ఒకో పార్టీ, ఒకో నాయకుడు ఒకో విధంగా మాట్లాడుతూ ఉంటారని అన్నారు. ఒకే నాయకుడు నాలుగు ఉపన్యాసాలు చేయాల్సి వస్తే నాలుగు విధాలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏ అంకితభావంతో, విలువలతో అయితే పవన్ రాజకీయాల్లోకి వచ్చారో, వాటిని జనసేన సైనికులందరూ కూడా పుణికిపుచ్చుకోవాలని సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more