దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కేంద్ర మాజీ ఆర్థకశాఖ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం తనయుడు కార్తి చిదంబరంకు ఊరట లభించింది. అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను విదేశాలకు అనుమతించవద్దన్న సీబిఐ, ఈడి తరపు న్యాయవాదులు వాదనలతో విభేధించిన అత్యున్నత న్యాయస్థానం కార్తి చిదంబరాన్ని విదేశాలకు వెళ్లేందుకు అనుమతిని మంజూరు చేసింది.
తన కుమార్తె కాలేజీ అడ్మీషన్ కోసం కార్తి చిదంబరం బ్రిటన్ వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతి కోరడంతో దానిపై విచారించిన న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఈ నెల 20 నుంచి సెప్టెంబర్ 31 వరకు బ్రిటన్ లో పర్యటించేందుకు అనుమతి కోరగా...దేశ సర్వోన్నత న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. ఎయిర్సెల్-యాక్సిస్, ఐఎన్ఎక్స్ మీడియా, మనీలాండరింగ్ కేసుల్లో కార్తి చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రిమినల్ కేసులను సీబీఐతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతున్నాయి.
గతంలోనూ కార్తి చిదంబరం సుప్రీంకోర్టు అనుమతితో విదేశాల్లో పర్యటించారు. జులై 23 నుంచి 31 వరకు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాలో ఆయన పర్యటించారు. కార్తి చిదంబరం మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతివ్వొద్దంటూ ఈడీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆయన విదేశీ పర్యటనకు వెళ్తే కేసు దర్యాప్తు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని వాదించారు. అయితే గతంలో ఇచ్చిన షరతులకు లోబడి కార్తి చిదంబరం నడుచుకున్నందున కార్తి చిదంబరానికి అనుమతిని ఇచ్చింది న్యాయస్థానం.
కాగా బ్రిటన్ పర్యటన పిటీషన్ పై ఇరుతరఫు వాదనలు విన్న సుప్రీంకోర్టు కొన్ని షరతులకు లోబడి ఆయన బ్రిటన్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది. బ్రిటన్ పర్యటనలో కార్తి చిదంబరం అక్కడి బ్యాంకుల్లోని ఖాతాలను మూయడం కానీ, కొత్త ఖాతాలను తెరవడంకానీ చేయకూడదని కోర్టు షరతు విధించింది. విమానం బయలుదేరే సమయం, తిరిగి భారత్కు వచ్చే వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అలాగే విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగివచ్చిన వెంటనే పాస్పోర్టును దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని కార్తి చిదంబరంను సుప్రీంకోర్టు ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more