ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. తమ వద్ద తీసుకున్న డబ్బును తిరగిఇవ్వకుండా పదే పదే వాయిదాలు వేస్తుందన్న కోపంతో ఇద్దరు మగమృగాళ్లు దారుణానికి పాల్పడ్డాయి. మైనర్ బాలికను సమీపంలోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లిన ఇద్దరు యువకులు అమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. పైశాచిక మృగాలు బాలికపై దారుణానికి పాల్పడుతుండగా, అటు వైపుగా ఎవరు వచ్చినా వారిని అలర్ట్ చేయడానికి ఓ మైనర్ బాలుడు కూడా సహకరించాడు. ఇంతకీ వారి వద్ద నుంచి తీసుకున్న మొత్తం కేవలం రూ. 1500 మాత్రమే.
అయితే అందుకు పలు రెట్లు అధికంగా వడ్డీని అడగమే బాలిక డబ్బు తిరిగివ్వలేకపోవడానికి కారణం. ఉత్తర్ ప్రదేశ్ లోని మురుద్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ ఖర్చుల కోసం జాహిద్, మోహన్ పాల్ అనే ఇద్దరు వ్యక్తుల వద్ద బాధితురాలు రూ. 1500 అప్పు తీసుకుంది. 11వ తరగతి ఫెయిల్ కావడంతో చదువును మధ్యలోనే ఆపేసిన ఆమె, కుటుంబ బాధ్యతలను చూసుకుంటోంది. ఈ నేపథ్యంలో, అప్పు తీర్చాలంటా బాధితురాలిపై జాహిద్, మోహన్ లు ఒత్తిడి తీసుకొచ్చారు. తనకు కొంచెం సమయం కావాలని ఆమె అడిగింది.
ఈ క్రమంలో ఆమె సైకిల్ పై వస్తుండగా జాహిద్, మోహన్ లతో పాటు మరో మైనర్ బాలుడు ఆమెను అడ్డుకున్నారు. అప్పు చెల్లించాలని అడగ్గా, డబ్బు లేదని ఆమె తెలిపింది. దీంతో, ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి, అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయం ఎవరికైనా చెబితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ విషయం ఆమె కుటుంబసభ్యులకు తెలియడంతో... వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా ఘజియాబాద్ ఎస్పీ మాట్లాడుతూ, ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని, విరితో పాటు మరో మైనర్ బాలుడిని కూడ అదుపులోకి తీసుకున్నామని, అతడ్ని కూడా జువైనల్ హోంకు తరలించనున్నామని చెప్పారు. మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడకపోయినప్పటికీ, నేరానికి సాయపడ్డాడని తెలిపారు. అందువల్ల అతన్ని జువైనల్ హోమ్ కు తరలించామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more