నెల్లూరు జిల్లా కావలిలో తన మిత్రుడు మోహన్ కుమారుడి పెళ్లికి హాజరయ్యేందుకు ఇవాళ ఉదయం మరో ఇద్దరు మిత్రులతో కలసి వెళ్తున్న నందమూరి హరికృష్ణ కారుకు నార్కెట్ పల్లికి చేరువలోని అన్నేపర్తి గ్రామశివార్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. సాక్షులు చెబుతున్న వివరాల ప్రకారం కారు ఒక్కసారిగా ఎడమ వైపు నుంచి కుడివైపుకు దూసుకెళ్లిందని దీంతో సీటుబెల్టు పెట్టుకోని కారణం చేత ఆయన కారులోంచి ఎగిరి పడ్డారని, ఫలితంగా తలకు బలమైన గాయాలు తగిలాయని చెబుతున్నారు. హరికృష్ణ స్వయంగా కారు నడిస్తున్న క్రమంలో అలా ఎలా ప్రమాదం జరిగిందంటే.. కారులో వున్న మిత్రులు చెబుతున్న కథనం ఇలా వుంది.
హరికృష్ణ హైదరాబాద్ ఇంటి నుంచి పొద్దున 4.30కి నెల్లూరు కావలికి బయలు దేరారు. కారులో మరో ఇద్దరు మిత్రులతో కలసి బయలుదేరి వెళ్లారు. ఉదయం 5.45కి నల్లగొండ జిల్లా అన్నెపర్తి పెట్రోల్ బంక్ దగ్గరకు చేరుకున్నారు. అక్కడే కారు ప్రమాదం జరిగింది. కారును హరికృష్ణే స్వయంగా నడుపుతున్నారు. గంటకు 120 కి.మీ. వేగంతో కారు వెళ్తున్న సమయంలో… మంచినీళ్ల కోసం వెనక్కి తిరిగి చూశారు హరికృష్ణ. రెప్పపాటులోనే డివైడర్ ను కారు ఢీకొట్టింది. పల్టీలు కొడుతూ ఎగిరి.. అవతలి రోడ్డుపై ఎదురుగా.. హైదరాబాద్ కు వస్తున్న మరో కారును ఢీకొట్టింది.
ప్రమాద సమయంలో కార్ డోర్ ఓపెన్ అవడంతో… హరికృష్ణ బయటకు ఎగరిపడ్డారు. ఈ క్రమంలో ఆయన తలకు తీవ్ర గాయాలు కావడంతో.. ఆస్పత్రికి తీసుకెళ్లినా.. వైద్యులు ఎంతో శ్రమించినా ఫలితం లేకపోయింది. ఆయన తిరిగిరాని లోకాలకు తరలివెళ్లిపోయారు. కారులో ఉన్న ఇద్దరు గాయాలతో ప్రాణాపాయం తప్పించుకున్నారు. ఎదురుగా వస్తున్న కారులోని మరో వ్యక్తికి యాక్సిడెంట్ లో కాలు విరిగింది. నెల్లూరు జిల్లా కావలిలోని బృందావన్ కళ్యాణమండపంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హరికృష్ణ ఆకస్మిక మరణవార్త విని ఆయన మిత్రుడు మోహన్ దిగ్ర్భాంతికి లోనయ్యారు. పెళ్లికి వస్తాడనుకున్న మిత్రుడు హరికృష్ణ ఇక లేడని వార్త విన్న మోహన్, అతని కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more