అన్నా చెలెల్ల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది రాఖీ పౌర్ణమి. ఈ రోజునే అన్నాదమ్ములతో కలసి అక్కాచెలెల్లు సంతోషంగా గడుపుతారు. అయితే రాఖీ ఫౌర్ణమి రోజున అన్నాదమ్ముల ముఖాలలో వెల్లివిరిసే అనందం, సంతోషం వారి జీవితాలలో శాశ్వతంగా వుండాలన్న సంకల్పంతో కొత్త విధానానికి నాంది పలుకుతున్నారు దేశంలోని కొందరు అక్కా చెలెల్లు. అయితే తెలంగాణలోని నిజామాబాద్ ఎంపీ, కేసీఆర్ తనయ కవిత మాత్రం గత ఏడాది చెప్పిన విషయాన్నే మరోమారు తన అభిమానులకు, కార్యకర్తలకు, తెలంగాణ అడపడుచులకు గుర్తుచేస్తుంది.
అదేంటంటే రక్షాబంధన్ రోజున అన్నాదమ్ములకు రాఖీ కట్టడంతో పాటు ఓ హెల్మెట్ ను కానుకగా ఇవ్వాలంటూ ‘సిస్టర్4ఛేంజ్’ క్యాంపెయిన్ మొదలెట్టింది. గత ఏడాది తన సోదరుడు కేటీఆర్ కు హెల్మెట్ ను కానుకగా ఇచ్చిన కవిత. ఈ సారి అదే అంశాన్ని క్యాంపెయిన్ గా చేపట్టింది. ‘గిఫ్ట్ ఎ హెల్మెట్’ పేరుతో ప్రారంభమైన ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్ కు ప్రముఖుల నుంచి ప్రశంసలు కూడా దక్కాయి.
అయితే ఈ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్న క్రమంలో కవిత ప్రచారానికి.. తాజాగా సూపర్స్టార్ మహేష్ బాబు, ‘సిస్టర్4ఛేంజ్’ క్యాంపెయిన్ కు మద్దతు పలికారు. ఈ ప్రచారానికి తాను కూడా మద్దతుగా నిలుస్తున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలో ఈ ప్రచారాన్ని ప్రమోట్ చేస్తూ ఓ వీడియో చేశారు. రోడ్డు ప్రమాదాల వల్ల అనేక మంది చనిపోతున్నారంటూ చెప్పిన ప్రిన్స్, రక్షాబంధన్ రోజు హెల్మెట్ బహుమతిగా ఇవ్వాలంటూ అడపడచులకు పిలుపునిచ్చారు. దీంతో ఈ క్యాంపెయిన్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
Happy Birthday @urstrulyMahesh garu !! Best wishes and a heartfelt thank you for your video message supporting this virtuous cause of #Sisters4Change. I'm sure this will inspire others to #GiftAHelmet and save precious lives ! pic.twitter.com/0KcK7DZLQa
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 9, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more