ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని ఓ వైపు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటరీ సమావేశాల్లో కూడా నిలదీస్తున్న ఏపీ ఎంపీలకు కాసింత ఊరటనిచ్చే వార్తను కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ తమ పార్టీ పార్లమెంటరీ బేటీలో వెల్లడించారు. పత్యేక హోదా తప్ప రాష్ట్రానికి కావాల్సిన అన్ని నిధులను కేటాయిస్తున్నామని చెప్పిన ఆయన విశాఖ జిల్లా ప్రజలు రాష్ట్ర విభజనకు ముందునుంచి కోరుకుంటున్న అంశంలో మాత్రం సానుకూలంగా స్పందించారు. ఇన్నాళ్లు రాష్ట్రపునర్విభజన బిల్లులో వున్నవాటిని పరిశీలిస్తున్నామని చెబుతూ వచ్చిన కేంద్రమంత్రి.. సరిగ్గా ఎన్నికలకు వెళ్లే ఏడాది కావడంతో పచ్చజెండా ఉపూతూ తీపికబురును చెప్పారు.
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించిన ఆయన.. విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని శుభవార్తను అందించారు. నాలుగేళ్లుగా కమిటీలు వేశాం వాటి నివేదికలు అందిన తరువాతే పరిశీలిస్తామని ఇటీవల కూడా చెప్పిన నితిన్ గడ్కారీ.. ఎన్నికలకు వేళాయరా అంటూ ఇప్పుడే రాష్ట్రంలో హాట్ గా కొనసాగుతున్న రాజకీయాల నేపథ్యంలో తాము బరిలో వున్నామని చాటుకునేందుకు వెంటవెంటనే చర్యలు తీసుకుని.. ఇక విశాఖ రైల్వే జోనుకు తాము సిద్దమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ అధికారికంగా ప్రత్యేక హోదాను, పేరును కల్పించలేకపోయినా దానికి సమానస్థాయిలో అన్ని రకాలుగా ఆదుకుంటూ.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి తమ ప్రభుత్వం పాటుపడుతుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. హోదా ఇచ్చిన నేపథ్యంలో లభించే అన్ని సదుపాయాలను, వసతులను కల్పిస్తున్నామని తెలిపారు. డిల్లీలో జరిగిన బీజేపి పార్లమెంటరీ పార్టీ భేటీలో ఆయన మాట్లాడారు. ఇటీవల ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గిన ప్రధానికి ఈ సందర్భంగా అభినందనలు తెలిపిన ఆయన అంధ్రప్రదేశ్ ను అదుకునేందుకు తమ ప్రభుత్వం ఎంతో పాటుపడిందన్నారు.
ఈ సమావేశం వేదికగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అంశాలను గడ్కరీ ప్రస్తావించారు. ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం జరుగుతోందని విమర్శించారు. విపక్ష పార్టీలన్నీ కలసి కేంద్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. హోదా పేరుతో ఏపీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. లోక్సభలో అవిశ్వాస తీర్మానం వల్ల దేశంలో చేపట్టిన కార్యక్రమాలపై ప్రజలకు వివరించే అవకాశం లభించిందన్నారు. పార్లమెంటులో అవిశ్వాసం పెట్టే వాతావరణ లేకపోయినా ప్రతిపక్షాలు తీసుకొచ్చాయని విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more