కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని అధికార ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పిస్తామని గత సార్వత్రిక ఎన్నికలలో ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ ఇచ్చిన పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగుతొంది. హోదా విషయంలో రాష్ట్రంలోని అధికార టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణం పార్లమెంటులో వీగిపోయిన నేపథ్యంలో బంధ్ తో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే.. హోదాను డిమాండ్ చేయాలన్న వైసీపీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది.
రాష్ట్రంలోని పలు వర్గాల ప్రజల నుంచి రాష్ట్ర బంద్ కు మద్దతు లభించడంతో బంద్ ప్రశాంతగా కొనసాగుతుంది. అయితే బంద్ ను విజయవంతం చేయడంతో పాటు బంద్ నేపథ్యంలో రహదారులపై ర్యాలీలు నిర్వహించడానికి ప్రయత్నించిన విపక్ష నేతలను, ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని ర్యాలీకి యత్నించిన వైసీపీ ఎమ్మెల్యే రోజాను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలిస్ స్టేషన్ కు తరలించారు. రాష్ట్రానికి హోదాను డిమాండ్ చేస్తున్న తమను అరెస్టు చేయడం కేంద్రంలోని అధికార పార్టీతో రాష్ట్రంలోని అధికార పార్టీ లాలూచీని ప్రజల ముందు బహిర్గతం చేస్తుందని రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
హోదాపై తమ పార్టీ బంద్ పిలుపునిచ్చిన క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 144 సెక్షన్ ను అమలుపర్చడం ఏంటని అమె ప్రశ్నించారు. చంద్రబాబు అదేశాలతో పోలీసులు ఉద్యమాన్ని అణచివేయాలని చూడటం నీచమైన చర్య అని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేకహాదా రావాలని అధికార పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని అన్నారు. ఇక నెల్లూరులో ఎమ్మెల్యే నారాయణస్వామిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు వైసీపీ నేతలను అంబటి రాంబాబు. బొత్సా సత్యానారాయణ, భూమన కరుణాకర్ రెడ్డీ సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more