ప్రధాని నరేంద్రమోడీని, బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను అభినవ ఛాణక్యులుగా పేర్కోన్న శివసేన.. అధికార పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. నాలుగేళ్లుగా మిత్రుడిగా వున్న మిత్రుడే.. కేంద్రప్రభుత్వంపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మాణాన్ని ఎందుకు ప్రవేశపెట్టారో.. అభినవ చాణక్యులు దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరముందని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే అన్నారు. కేంద్రంలోని అధికార పార్టీ అన్ని అంశాలను రాజకీయ ప్రయోజనాలతో ముడివేస్తున్నందునే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్న సందేహాలను అయన వ్యక్తం చేశారు.జ
మిత్రపక్షమైన టీడీపీ ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టిందో అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం అధికార పక్షానిదని, అయితే అభినవ చాణక్యులు మాత్రం దీనిపై ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు సమాధానం చెప్పాలని ఆయన ఉద్దవ్ థాకరే డిమాండ్ చేశారు. శివసేన పార్టీ పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘లోక్సభలో అవిశ్వాసం ప్రవేశపెట్టిందెవరో చూడండి. టీడీపీ పెట్టింది. టీడీపీ ఎవరు? బీజేపీకి మిత్రపక్షం. మిత్రులు ఎందుకిలా అవిశ్వాసం వ్యక్తంచేస్తున్నారన్నదే ప్రశ్న. దేశంలో తొలిసారి ఓ మిత్రపక్షం ఈ తీర్మానం తెచ్చింది’ అని వ్యాఖ్యానించారు.
తీర్మానంపై చర్చ, ఓటింగ్కు గైర్హాజరు కావడంపై మాట్లాడుతూ.. ‘ఎవరు ఎవరిపై అవిశ్వాసం చూపాలి. మేం ప్రతిపక్షంతో సాగాలా? కానీ ఇన్నేళ్లూ అవేం చేస్తున్నాయి? ప్రజలను ప్రభావితం చేసే అంశాలపై అవి మాట్లాడుతున్నాయా’ అని ఆక్షేపించారు. ఎన్డీయే పాలనలో దేశంలోని ఆవులకు రక్షణ ఉంది.. కానీ, మహిళలకు లేదు. ప్రపంచంలోనే మహిళలకు భద్రత లేని దేశంగా భారత్ మారింది. ఇందుకు సిగ్గుపడాలి’’ అంటూ మోదీ సర్కారుపై థాకరే విరుచుకుపడ్డారు. మూక దాడుల నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘
ప్రభుత్వంలో మేమూ భాగస్వాములమే. కానీ, తప్పు జరుగుతుంటే తప్పకుండా మాట్లాడతాం. మేం భారతీయ జనతాకు మిత్రులం. అంతేకానీ, ఏ పార్టీకీ కాదు’’ అని వ్యాఖ్యానించారు. గోరక్షకులు పేరుతో దాడులు చేయడం సముచితం కాదని స్వయంగా ప్రధాని మోడీ చెప్పినా.. దాడులు ఆగడం లేదంటే.. ఈ విషయంలో ఎవరు దాడులకు ప్రేరణ కల్పిస్తున్నారు.? ఎవరు మూకలను ఉసిగొల్పుతున్నారన్న దిశగా విచారణ జరగాల్సి వుందని అభిప్రాయపడ్డారు. బీజేపీ చెప్పే హిందూత్వను ఆయన బూటకంగా అభివర్ణించారు. గో సంరక్షకులను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.
ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై జాతివ్యతిరేకి అని ముద్ర వేయడం ఎంతవరకు సమంజసమరి ఆయన ప్రశ్నించారు. ఎవరు జాతీయవాది? ఎవరు జాతి వ్యతిరేకి అన్న విషయాన్ని నిర్ణయించడానికి బీజేపీ కానీ దాని అనుబంధ సంస్థలు కానీ ఎవరని ఆయన ప్రశ్నించారు. ఒకరి జాతీయవాదాన్ని ప్రశ్నించేందుకు బీజేపి దాని అనుబంధ సంస్థలకు ఏమి అధికారముందని ఆయన ప్రశ్నించారు. ‘వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధంకండి’ అని బీజేపీ అధ్యక్షుడు అమిత్షా తమ పార్టీ శ్రేణులకు ఇచ్చిన పిలుపుపై ఠాక్రే మండిపడ్డారు. ‘‘మేం సామాన్యుడి కల నెరవేర్చడానికి పోరాడుతున్నాం. మోదీ కల నెరవేర్చడానికి కాదు’ అని స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more