న 17 ఏళ్ల కొడుకును వారి ఇంట్లో పెట్టుకుని ఓ తల్లీ కూతరు లైంగికంగా వాడుకుంటున్నారంటూ ఓ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో నేపాల్కు చెందిన 45 ఏళ్ల తల్లి, 22 ఏళ్ల ఆమె కూతురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శివ కుమార్ వివరాలు వెల్లడించారు.
భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ కింద ఇద్దరు మహిళలపై కేసులు నమోదు చేశామని ఏఎస్పీ చెప్పారు. మైనర్ను వ్యభిచారం కోసం వాడుకోవడం కిందకు ఈ సెక్షన్ వస్తుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం బాధితుడి వయసు 17 సంవత్సరాల 6 నెలలని, అందుకే లైంగిక నేరాల నుంచి పిల్లలకు భద్రత (పోక్సో) చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని వివరించారు. అయితే నిందితులను అరెస్టు చేయలేదని, ఈ ఘటనపై లోతుగా విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కుర్రాడి తండ్రి ఫిర్యాదు ప్రకారం.. అతని కొడుకును మహిళ, ఆమె కుమార్తె తమ ఇంటికి తీసుకెళ్లిపోయారు. మూడు నెలలుగా ఆ కుర్రాడు వారి వద్దే ఉంటున్నాడు. ఈ మూడు నెలలపాటు తల్లీకూతుళ్లు తన కుమారుడిని లైంగికంగా వాడుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ మహిళ భర్త గురించి మీడియా ప్రస్తావించగా.. ఆమె వితంతువా, లేదంటే భర్త నుంచి విడిపోయిందా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదని పోలీసులు చెప్పారు. బాధిత కుర్రాడు కూడా చదువు ఆపేశాడని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి సమాచారం దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more