ఐటీఐ పూర్తి చేసిన నిరుద్యోగ యువతీ యువకులకు గుడ్ న్యూస్. దక్షిణ మధ్య రైల్వే ఐటీఐ పూర్తి చేసిన నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. సౌత్ సెంట్రల్ రైల్వేలో భారీ రిక్రూట్ మెంట్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీఐ పూర్తి చేసి అప్రెంటీస్ కోసం వేచిచూస్తున్న సంబంధిత ట్రేడ్ అశావహులకు అప్రంటీస్ తో పాటు ఉద్యోగాలను కూడి ఇచ్చేందుకు దక్షిణమధ్య రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 4,103 ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది.
అభ్యర్థులు పదో తరగతితో 50శాతం పర్సెంటేజీతో ఉత్తీర్ణులై, ITI క్వాలిఫికేషన్ ఉన్నవారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులని నోటిఫికేషన్ లో రైల్వే స్ఫష్టం చేసింది. రిజర్వేషన్ల వారీగా ఎస్సీలకు 616, ఎస్టీలకు 308, వెనుకబడిన తరగతుల వారికి 1107, జనరల్ కేటగిరీ వారికి 2వేల 72 పోస్టులను కేటాయించారు. ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చివరి తేదీని జులై 17. కాగా ఈ ఉద్యోగాలకు అప్ లైన్ లో కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు. www.scr.indianrailways.gov.in వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ను డౌట్ లోడ్ చేసుకుని పూర్తిచేసి.. The Deputy Chief Personnel Officer/ A & R/ SCR, RRC, 1st Floor, C-Block, Rail Nilayam, Secunderabad చిరునామాకు పంపాలి.
ఏసీ మెకానిక్ విభాగంలో 249 పోస్టులు, కార్పెంటర్ విభాగంలో 16, డీజిల్ మెకానిక్ విభాగంలో 640, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ విభాగంలో 18, ఎలక్ట్రీషియన్ విభాగంలో 871, ఎలక్ట్రానిక్ మెకానిక్ విభాగంలో 102, ఫిట్టర్ విభాగంలో 1,460, మెషినిస్ట్ విభాగంలో 74, MMWవిభాగంలో 24 , MMTM విభాగంలో 12, పెయింటర్ విభాగంలో 40, వెల్డర్ విభాగంలో 597 పోస్టులు ఉన్నాయి. జూన్ 18 నాటికి 24 ఏళ్లలోపు వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అయితే ఉద్యోగ ఎంపిక మాత్రం అభ్యర్థులు పదో తరగతి ఫలితాలతో పాటు ఐటీఐ మెరిట్ మార్కులను పరిగణలోకి తీసుకుని చేయనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more