రానున్న సార్వత్రిక ఎన్నికలలో.. అవకాశమున్న అన్ని చోట్లు బరిలోకి దిగాలని, మళ్లీ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్న బీజేపి.. అప్పుడే మిత్రులతో పొత్తు విషయాలపై చర్చను తీసుకువచ్చింది. ఈ క్రమంలో గత ఎన్నికలలో గెలిచిన అన్ని స్థానాలలో తాము పోటీకి సిద్దమన్న ప్రకటనలను పార్టీ నేతలు ఇవ్వడంతో.. అధికార కూటమిలో లుకలుకలు బయటపడ్డాయి. తమతో పొత్తు వద్దనుకున్న నేపథ్యంలో ఒంటిరిగా బరిలోకి దిగే స్వేచ్చ ఆ పార్టీకి వుందని అధికార పార్టీ జేడీయూ తేల్చిచెప్పింది. ఇంతకీ ఎక్కడా.. అంటే మహాకూటమితో ఎన్నికలకు వెళ్లి.. తరువాత బీజేపిపై మొగ్గుచూపిన బీహార్ లోని అధికార జేడీయు పార్టీతో బీజేపి బయటపడ్డాయి.
రాష్ట్రంలోని 40 లోక్సభ స్థానాల్లో సీట్ల పంపకంపై ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో జేడీయూ జనరల్ సెక్రటరీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నితీశ్ లేకుండా బీహార్లో తాము గెలవలేమని బీజేపీకి కూడా తెలుసు. మాతో కనుక పొత్తు వద్దనుకుంటే రాష్ట్రంలోని 40 స్థానాల్లోనూ బీజేపీ పోటీ చేసుకోవచ్చు. మాకేమీ అభ్యంతరం లేదు’’ అని సంజయ్ సింగ్ పేర్కొన్నారు. అనవసర, అర్థం పర్థంలేని వ్యాఖ్యలు చేయకుండా పార్టీ నేతల నోళ్లను అదుపులో పెట్టాలని బీజేపీకి సూచించారు. ‘‘రాష్ట్రంలోని బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది’’ అని ఆయన హెచ్చరించారు.
2014లో గెలిచిన అన్ని లోక్సభ స్థానాల్లోనూ బీజేపీ పోటీ చేస్తుందని ఇటీవల బీజేపీ జనరల్ సెక్రటరీ రాజేంద్ర సింగ్ స్పష్టం చేశారు. అదే సమయంలో మిత్ర పక్షాలను కూడా గౌరవిస్తుందని పేర్కొన్నారు. సీట్ల పంపకం సరైన పద్ధతిలో చేసుకోవడం ద్వారా రాష్ట్రంలోని 40 సీట్లను ఎన్డీయే గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ 22 లోక్సభ స్థానాలను గెలుచుకోగా, మిత్ర పక్షాలు మరో 9 సీట్లు గెలుచుకున్నాయి. జేడీయూ రెండింటితోనే సరిపెట్టుకుంది. దీంతో ఈసారి ఆ సీట్లన్నీ తమకు కావాలని బీజేపీ పట్టుబడుతోంది. అది కుదరని పని జేడీయూ చెబుతోంది. దీంతో రెండు పార్టీల మధ్య చెడింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more