కుటుంబ కలహాల కారణంగా టీవీ యాంకర్ తేజశ్విని ఆత్మహత్యకు పాల్పడిందన్న ఘటన విజయవాడలో కలకలం రేపగా, అత్తతో అమె గొడవపడిన తరువాత గదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరి బిగించుకుని అత్మహత్యకు పాల్పడిందన్న వార్తలు వచ్చాయి. అయితే ఈ కేసు దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు ఈ కేసులోని మరో ట్విస్టును కూడా వెలికి తీసారు. ఆత్మహత్యకు ముందు తేజశ్విని రాసిన సూసైడ్ నోట్ పోలీసుల చేతికి చిక్కడంతో ధర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు భర్త వేధింపులే అమె మరణానికి కారణమని తేల్చారు.
తేజస్వీ మరణాన్ని అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. అమె మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు అక్కడ పోస్టుమార్టం నిర్వహించారు. విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న మాజీ యాంకర్ తేజస్విని ఆత్మహత్య వెనుక ఆమె భర్త పవన్ కుమార్ ప్రమేయం ఉందని ప్రాథమిక సాక్ష్యాలు లభించాయని, ఆయన ప్రస్తుతం పరారీలో ఉండగా, అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశామని పోలీసు అధికారి ఒకరు ప్రకటించారు. పవన్ ను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నామని తెలిపారు.
కంకిపాడు పీఎస్ లో తేజస్విని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేశామని చెప్పారు. సూసైడ్ నోట్ లో తేజస్విని రాసిన వివరాలు, ఆమె తల్లిదండ్రులను విచారించిన తరువాత తమకు లభించిన వివరాలకు పొంతన లేదని, ఆ కారణంతోనే కేసు విచారణ జటిలమైందని తెలిపారు. ప్రస్తుతం పవన్ కుమార్ ఫోన్ ను సీజ్ చేశామని, దానిలోని సమాచారాన్ని విశ్లేషించగా, తేజస్వినికి వేధింపులు నిజమేనని తేలిందని, సాధ్యమైనంత త్వరలోనే అతన్ని అరెస్ట్ చేస్తామని తెలియజేశారు. అతనిపై ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న సెక్షన్ల కింద కేసు బుక్ చేశామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more