కర్ణాటక ఎన్నికల తరువాత వరుసగా 16 రోజుల పాటు పెరుగుతూ వాహనదారులకు చుక్కులు చూపిన ఇంధన ధరలు క్రమంగా గత నెల 29 నుంచి వరుసగా 14 రోజుల పాటు తగ్గుతూ వస్తున్నాయి. 16 రోజుల పాటు సుమారుగా నాలుగు రూపాయల మేర పెరిగిన ఇంధన ధరలు.. 14 రోజుల వ్యవధితో రూ.2 మేర తగ్గాయి. గత నెల 14 నుంచి 18 వరకు నాలుగు రోజుల వ్యవధిలోనే రూపాయి మేర పెరిగిన ఇంధన ధర.. గత నాలుగు రోజుల వ్యవధిలో రూపాయి మేర తగ్గముఖం పట్టింది. ఇది వాహనదారులకు కొంత ఊరట కలిగించే విషయమే.
అయితే 16 రోజుల వ్యవధిలో పెంచిన ధరలో అర్థశాతం మేర 14 రోజుల్లో తగ్గింది. అయినా ఇంకా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెట్రోల్ ధర లీటరు రూ. 80 పైగానే కొనసాగుతుంది. అంతర్జాతీయంగా క్రూడ్ అయిల్ మార్కెట్లో చమురు ధరలు దిగివస్తున్న నేపథ్యంలో ఇంధన ధరలు కూడా దిగివస్తున్నాయి. కాగా ఇవాళ వాహనదారులకు ఊరట కలిగించేలా పెట్రోల్ ధరలు పెట్రోలు ధరను 15 పైసలు, డీజెల్ ధరను 10 పైసలు తగ్గించిన్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది.
ఇక తాజా తగ్గింపు ధరల నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా వున్నాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ 75.43 రూపాయలుండగా, లీటరు డీజిల్ 67.95గా కొ నసాగుతుంది. ఇక ముంబైలో లీటరు పెట్రోల్ ధర 84.26గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర 72.24గా వుంది.. కోల్ కతా నగరంలో లీటరు పెట్రోల్ ధర79.1గా నమోదవ్వగా, లీటరు డీజిల్ ధర 70.4గా కొనసాగుతుంది. ఇక తాజా ధరల నేపథ్యంలో హైదరాబాద్ మార్కెట్లో లీటరు పెట్రోల్ ధర 80.96గా కొనసాగుతుండగా, లీటరు డీజిల్ ధర రూ.67.85గా ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more