Suspense in Karnataka politics after Election Result వారంలో కింగ్.. అప్పటి దాకా సస్పెన్స్

Suspense in karnataka politics after election result

Assembly elections in Karnataka, Karnataka news, Karnataka 2018 results, Karnataka Assembly elections, Karnataka updates ,arnataka elections, Karnataka 2018 elections, Congress, BJP, JDS

Suspense in Karnataka politics after Election Result

వారంలో కింగ్.. అప్పటి దాకా సస్పెన్స్

Posted: 05/15/2018 06:09 PM IST
Suspense in karnataka politics after election result

(Image source from: indianexpress.com)

కర్ణాటక ఎన్నికల ఫలితాలు కొత్త రాజకీయాలకు తెర తీశాయి. ఎన్నికల ఫలితాల తర్వాత పలానా రోజు తాను ప్రమాణ స్వీకారం చేస్తానంటూ సిద్ధారామయ్య చేసిన ప్రకటన అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. తర్వాత బీజేపీ నుండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలిచిన యడ్యూరప్ప కూడా తానే సిఎం కాబోతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు దాదాపుగా తేలిపోయిన వేళ.. బీజేపీ నుండి యడ్యూరప్ప, జేడీయూ నుండి కుమార స్వామి విడివిడిగా గవర్నర్ ను కలిశారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని.. తమకు వారం రోజులు గడువు ఇవ్వాలని వారు గవర్నర్ ను కోరడం జరిగింది.

కర్ణాటకలో మరో వారం రోజుల్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారో తేలుతుంది. కానీ అంతకు ముందే హస్తిన నుండి రాజకీయాలు బెంగళూరుకు మారుతున్నాయి. బీజేపీ నుండి అమిత్ షా కర్ణాటక ఫలితాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం.. కాంగ్రెస్ పార్టీ నుండి ఆజాద్ వంటి పెద్దలు బెంగళూరులోనే ఉండటంతో పరిస్థితులు వాడివేడిగా ఉన్నాయి. కాగా క్లీయర్ మెజార్టీ రాని కాంగ్రెస్... జేడీయూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మాత్రం తాము మద్దతిస్తామని ప్రకటించారు. కానీ బీజేపీ మాత్రం వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. కాంగ్రెస్ రహిత భారతంలో భాగంగా కర్ణాటకలో తిరిగి తమ పార్టీ జెండాను పాతడానికి పథకం రచిస్తోంది. ఏదిఏమైనా ఇవాల్టి నుండి కర్ణాటక రాజకీయాలు కీలక మలుపు తిరుగుతాయన్నది మాత్రం వాస్తవం.

 
 

 

 
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karnataka elections  BJP  Congress  JDS  

Other Articles