అంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరొందిన టాలీవుడ్ హీరో రాజశేఖర్ నటించిన చిత్రం పీఎస్వీ గరుడ వేగ చిత్రం అయనకు తాజా హిట్ ఇచ్చి.. తన కెరీర్ ను మళ్లీ చిగురింపజేసింది. అయితే ఈ చిత్రంపై తాజాగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు తాజాగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘గరుడ వేగ’ చిత్రానికి సంబంధించి ఇకపై ఎలాంటి ప్రదర్శనలు ఉండరాదని సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన అదేశాల సారాంశం. టీవీల్లోగానీ, యూట్యూబ్ సహా ఎలాంటి సామాజిక మాద్యమాల్లో కానీ ఈ చిత్రాన్ని ప్రదర్శించరాదని, కనీసం పోస్టులు కూడా చేయరాదని అదేశాల్లో పేర్కోంది.
ఈ చిత్రానికి సంబంధించి ప్రచార కార్యక్రమాలు, ప్రెస్ మీట్ లు నిర్వహించరాదంటూ నిర్మాతలు, దర్శకుడితోపాటు యూట్యూబ్ కు ఆదేశాలు జారీ అయ్యాయి. గరుడ వేగ సినిమా తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని, దీని ప్రదర్శనలను నిలిపివేయాలంటూ హైదరాబాద్ ఉప్పరపల్లిలోని అటమిక్ ఎనర్జీ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సిటీ సివిల్ కోర్టు 4వ జూనియర్ సివిల్ జడ్జి కె.కిరణ్ కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పి.శ్రీహర్షారెడ్డి వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు.
శ్రీహర్షారెడ్డి న్యాయస్థానంలో వాదనలు వినిపిస్తై.. ఈ చిత్రం మొత్తం యురేనియం కార్పొరేషన్లో జరిగిన స్కాం గురించి ఉందన్నారు. యురేనియం స్కాంలో తుమ్మలపల్లి ఎమ్మెల్యే, హోంమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రిత్వశాఖ అధికారులు, యురేనియం కార్పొరేషన్ ఛైర్మన్, ఉన్నతాధికారులు పాత్రధారులైనట్లు చిత్రీకరించారని, ఎన్ఐఏ అసిస్టెంట్ కమిషనర్ గా హీరో స్కాంను బట్టబయలు చేస్తున్నట్లు చూపారన్నారు. అందువల్ల చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని కోరారు. వాదనలను విన్న జడ్జి పిటిషనర్ వాదనలతో ఏకీభవిస్తూ తదుపరి ఉత్తర్వులు వెలువడేదాక చిత్ర ప్రదర్శన, ప్రచార కార్యక్రమాలు, ప్రెస్ మీట్ లు నిర్వహించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more