dalits protest against amit shah roadshow in mysore అమిత్ షాకు అక్కడ వరుస షాకులు తగులుతున్నాయ్..

Dalits protest against amit shah roadshow in mysore

BJP National President, Amit Shah, Amit Shah shock, dalits and christians, dalits and christians protest, amit shah roadshow, mysore, assembly elections, karnataka, Constitution, Dalit, Mysore, viral video, Mysuru, Karnataka assembly elections, BJP President Amit Shah, Dalit leaders, Ananth Kumar Hegde, Karnataka Assembly polls, slogans

BJP National President Amit Shah was shocked by dalits and christains who conducted a protest against his roadshow in mysore as a part of election campain in karnataka.

ITEMVIDEOS: అమిత్ షాకు అక్కడ వరుస షాకులు తగులుతున్నాయ్..

Posted: 04/11/2018 02:06 PM IST
Dalits protest against amit shah roadshow in mysore

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపి పార్టీ గెలుపును తన భుజస్కందాలపై ఎత్తుకుని ప్రచారం చేస్తున్న జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు మాత్రం అక్కడ వరుస షాకులు తగులుతున్నాయి. గత నెల 30న దళిత నాయకులతో మైసూరులోని ఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశం మధ్యలో కొందరు దళిత సంఘాల నేతలు లేచి ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. అమిత్ షా సహా కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డేకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా షాకైన అమిత్ షా.. తన ప్రసంగాన్ని మధ్యలోనే అపేశారు. ఈ ఘటనను మరువక ముందే మరోమారు మైసూరులో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.

కర్నాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ప్రచారం నిర్వహిస్తూ మరోమారు మైసూరుకు వచ్చిన షాకు మళ్లీ దళితసంఘాలు షాకిచ్చాయి. ఆయన రోడ్ షో నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న దళిత సంఘాలు ఆయన వెళ్లే మార్గంలో అయనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలకు దిగారు. దళితులు, క్రైస్తవులపై దాడులు పెరిగిపోయాయని, వాటిని ఆపడంలో కేంద్రం విఫలమవుతోందని, దేశ జనాభాలో 30 శాతం ఉన్న దళితులు మరింత పేదలుగా మారిపోతున్నారని, అంటరానివారుగా ఉన్నారని ఆరోపిస్తూ, పలువురు అమిత్ షాను అడ్డుకున్నారు.

తాజాగా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నీరుగార్చే చర్యలను కేంద్రం ప్రారంభించిందని ఆరోపిస్తూ, తమ విషయంలో కేంద్రం ఏం చేయాలనుందో చెప్పాలని నినాదాలు చేశారు. అడుగడుగునా తమకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కాగా, దళితులు రోడ్డుపై బైటాయించారన్న సమాచారాన్ని ముందుగానే తెలుసుకున్న అమిత్ షా, ఆ ప్రాంతంలో జరపాల్సిన తన రోడ్ షోను రద్దు చేసుకుని వెనక్కు వెళ్లిపోయారు. కాగా, కర్ణాటకలో 19 శాతం దళితులు ఉండగా, 224 సీట్లున్న అసెంబ్లీలో 60 స్థానాల్లో జయాపజయాలను నిర్దేశించే స్థాయిలో దళిత, క్రైస్తవ ఓటర్లు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles