Delhi police ruined YCP MPs indefinite hunger strike వైసీపీ ఎంపీ ఆమరణ దీక్ష భగ్నం..

Delhi police ruined ycp mps indefinite hunger strike

Andhra Pradesh, YSR Congress Party, Y. S. Jaganmohan Reddy, Special Category Status, Telugu people, Y. S. Vijayamma, Kadapala Mohan Reddy, Mithun Reddy, Sumitra Mahajan, Y.S. Jagan Mohan Reddy, Subbareddy, Delhi, New Delhi, Lok Sabha speaker, Ram Manohar Lohia hospital, Avinash Reddy

YSRCP MPs Avinash Reddy and Mithun Reddy were forcibily shifted to the Ram Manohar Lohia hospital as their health condition is declining, who are on indefinite hunger strike demanding Special Category Status for the state since six days.

ITEMVIDEOS: వైసీపీ ఆమరణ దీక్ష భగ్నం.. ఎంపీల అరోగ్యం క్షీణించడమే కారణం..

Posted: 04/11/2018 12:50 PM IST
Delhi police ruined ycp mps indefinite hunger strike

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించచాలన్న డిమాండ్ తో పాటు విశాఖ రైల్వేజోన్, కడపలో స్టీలు ప్లాంటు సహా విభజన చట్టంలో పేర్కోన్న అన్ని హామీలను కేంద్రం తక్షణమే అమలు చేయాలని దేశరాజధాని ఢిల్లీలోని ఆంధ్రభవన్ వద్ద దీక్ష చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేల అమరణ నిరహారాదీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆరవ రోజున ఉదయం దీక్షకూ పూనుకున్న ఇద్దరు ఎంపీలకు అరోగ్య పరీక్షలు చేసిన ఢిల్లీ వైద్యులు.. వారి అరోగ్యాలు క్షీణిస్తున్నాయని తక్షణం దీక్షను విరమించాలని కూడా కోరారు.

అయితే దీక్షను విరమించేందుకు ఎంపీలు అంగీకరించలేదు. తమ డిమాండ్లపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తమ దీక్ష కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. దీంతో ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డీల అరోగ్యాల క్షీణిస్తున్నాయని నివేదికను రూపోందించిన వైద్యులు వాటిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ఈ ఇద్దరు యువ ఎంపీల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని నివేదికలో పేర్కోన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి రక్తపోటు స్థాయి 80/60కి పడిపోయింది. ఈ ఉదయం ఆయన బీపీ బ్లడ్ షుగర్ లను చెక్ చేసిన వైద్యులు, ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించుకుంటే ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరించారు.

ఆయన బ్లడ్ షుగర్ లెవెల్ సైతం 71కి పడిపోయింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని బలవంతంగానైనా ఆయన్ను ఆసుపత్రికి తరలించాలని ప్రయత్నాలు విఫలమయ్యాయి. తాము దీక్షను విరమించేది లేదని అవినాష్ వెల్లడించారు. ఇదే సమయంలో మరో ఎంపీ మిధున్ రెడ్డి బీపీ 110/70గా ఉండగా, బ్లడ్ షుగర్ 73కు తగ్గింది. ఇద్దరి శరీరాల్లో కీటోన్స్ 2గా ఉన్నాయని పరీక్షలు చేసిన ఆర్ఎంఎల్ వైద్యులు వెల్లడించారు. ఇద్దరూ డీ హైడ్రేషన్ తో బాధపడుతున్నారని పోలీసులకు రిపోర్టు ఇచ్చారు. సమయం గడిచే కొద్దీ వీరి ఆరోగ్యం మరింత విషమిస్తుందని చెప్పారు.  దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పార్టీ కార్యకర్తలను చెదరగొడుతూ ఎంపీలను బలవంతంగా అంబులెన్స్ లోకి ఎక్కించి ఆసుపత్రికి తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles