స్వచ్ఛమైన గాలీ, నీరు ప్రజలకు లేకుండా చేసే అభివృద్ది ఎవరి కోసం.. ఎందుకోసమని జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. కలుషిత పరిశ్రమలను దేశంలో ఏర్పాటు చేయడం వల్ల అనేక కొత్త వ్యాధ్యులు, అరోగ్యసమస్యలు తలెత్తి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. దేశం జీడీపీ రేటు పెరిగిందని, ప్రపంచ దేశాలలోనే టాప్ దేశాల సరసన వున్నామని మనకు మనం భజన చేసుకోవడం వల్ల లాభాం ఏమిటని అయన ప్రశ్నించారు.
దేశ రాజధాని ఢిల్లీ సహా దేశమంతా స్వచ్ఛమైన గాలి కూడా లేక ఇబ్బంది పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వేకువ జామున వాకింగ్ చేసినా అనారోగ్య సమస్యలు తలెత్తే స్థాయికి కాలుష్యం చేరి ప్రజారోగ్యాలపై కాటు వేస్తున్నా ఇంకా దేశం పురోగాభివృద్ది అంటూ ఉదరగొట్టడం ఎందుకని.. ఎవరికోసమని ఆయన నిలదీశారు. ఏపీలోని తుండూరు ఆక్వా పార్కును తీసుకోవాలని అన్నారు. ఆ ప్రాంతానికి చెందిన యువకులు తనను కలిశారని... కనీసం స్వచ్ఛమైన గాలి, నీరు కూడా మాకు లేకుండా చేస్తున్నారని వారు తన వద్ద ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు.
ఎంతో అనుభవం ఉన్న రాజకీయ నేతలు చేస్తున్న ప్రయోగాలు వ్యవస్థ పట్ల శాపాలుగా మారుతున్నాయిన పవన్ అవేదన వ్యక్తం చేశారు. లోపభూయిష్టమైన పబ్లిక్ పాలసీలు, స్థిరంగా లేని ఆర్థిక ఎదుగుదల, బలహీనవర్గాలపై బలంగా పని చేసే చట్టాలు, బలంగా ఉన్నవారిపై బలహీనంగా పని చేసే చట్టాలు ఇలా ఎన్నో అంశాలు వ్యవస్థను పీడిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఇలాగే కొనసాగితే... ప్రాథమిక హక్కుల కోసం కూడా ప్రజలు పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు. దేశంలోని కోట్లాది మంది ప్రజలు ఇదే భావనలో ఉన్నారని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
భారతదేశ ఎకానమీ, వ్యవస్థ లోపాలపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మన దేశ ఎకానమీ పెరుగుతూ ఉండవచ్చు, ప్రపంచ వేదికపై ఇండియా మెరుస్తూ ఉండవచ్చు... కానీ రాజకీయ వ్యవస్థలో నెలకొన్న అవినీతి దేశాన్ని దిగజార్చుతోందని ఆయన అన్నారు. ప్రజల పట్ల, వ్యవస్థ పట్ల రాజకీయనేతలకు ఎలాంటి పట్టింపులు లేకపోవడం మన వ్యవస్థను నాశనం చేస్తోందని తెలిపారు. అవినీతే లేని సమాజం కోసం నేతలు పాటుపడాలని, అభివృద్దికి కొంచెం జరిగినా అది దేశాన్ని ముందంజలో నిలబెడుతుందని పవన్ అభిప్రాయపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more