మధ్యప్రదేశ్ ప్రభుత్వం మత గురువులుగా వెలుగొందుతున్న అయిదుగురు బాబాలకు రాష్ట్ర ప్రభుత్వం ‘సహాయ మంత్రి’ హోదా కల్పించడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. నర్మదా నదీ పరిరక్షణ పేరుతో జరుగుతున్న కుంభకోణాలను బయటపెట్టేందుకు, అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టాలని డిమాండ్ తో రథయాత్ర చేపడతామని బాబాలు ప్రకటించిన నేపథ్యంలో వారినే కమిటీ సభ్యులు ప్రకటించిన ప్రభుత్వం.. వారికి సహాయమంత్రి హోదాను ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. నర్మదానంద్ మహారాజ్, హరిహరానంద్ మహారాజ్, కంప్యూటర్ బాబా, భయ్యు మహారాజ్, పండిట్ యోగేంద్ర మహంత్ లకు ప్రభుత్వం ఈ హోదా కల్పించింది. వీర రథయాత్ర నేపథ్యంలో మార్చి 31న ప్రభుత్వం హడావిడిగా ఈ కమిటీని ఏర్పాటు చేసింది.
అయితే బాబాలకు మంత్రి హోదా ఇవ్వడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. కేవలం బాబాలు రథయాత్ర చేస్తారన్న క్రమంలో ప్రభుత్వానికి నర్మదా నది పరిరక్షణ గుర్తుకువచ్చిందా..? అని ప్రశ్నిస్తోంది. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా చేసిందని, ఎన్నికల్లో బాబాల అనుచరుల మద్దతు కోసం వారికి ఈ హోదా కల్పించిందని ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి నర్మద పరిరక్షణ విస్మరించారని, ఆయన పాపాలను కడుక్కోవడానికి బాబాలకు మంత్రి హోదాలు ఇచ్చారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యూనిట్ అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది విమర్శించారు.
ఇదిలావుండగా, రథయాత్ర చేపట్టాల్సిన అవసరం ఇక తమకు లేదని, ప్రభుత్వమే కమిటీని వేసిన క్రమంలో.. దాని పరిరక్షణ బాధ్యతల కమిటీలో తమను కూడా సభ్యులను చేసినందుకు గాను ఇక యాత్ర కాకుండా నదీ పరిరక్షణకు చర్యలు చేపడతామని అన్నారు. ఇక తనకు రాష్ట్రమంత్రి హోదా కల్పించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి కంప్యూటర్ బాబా కృతజ్ఞతలు తెలిపారు. కంప్యూటర్ బాబా సహా మొత్తం ఐదుగురు హిందూ సాధువులకు కేబినెట్ ర్యాంకు కల్పిస్తూ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై కంప్యూటర్ బాబా స్పందిస్తూ... ‘‘మాపై నమ్మకం ఉంచినందుకు సాధువుల సమాజం తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సమాజ శ్రేయోభివృద్ధి కోసం మా శాయశక్తులా ప్రయత్నిస్తాం...’’ అని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more