కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ మధ్యకాలంలో లండన్ లో తలదాచుకున్న ఆర్థిక నేరస్థుడు విజయ్ మాల్యాను దేశానికి తీసుకురావడం అంత సులువైన పనికాదని చెప్పిన మంత్రి.. ఇక తాజాగా పొట్టకూటి కోసం విదేశాలకు తరలివెళ్లి.. నిత్యం రావణకాష్టంగా రగులుతున్న ఇరాక్ దేశంలో.. కరుడుగట్టిన ఐసిస్ ఉగ్రవాదుల చేతుల్లో హతమైన భారతీయుల మృతదేహాలను భారత్ తీసుకువచ్చిన అనంతరం ఆయన మీడియాతో వివరాలు తెలుపుతూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలంటే బిస్కెట్ల పంపిణీ కాదంటూ మీడియాపైనే రుసరుసలాడారు.
విపత్తులు సంభవించినప్పుడు.. లేక అలజడుల్లో మృతిచెందిన వారికో ప్రభుత్వం పరిహారాన్ని ముందుగా ప్రకటించి.. మృతుల కుటుంబాలకు తాము అండగా వున్నమన్నా ధైర్యాన్ని అందిస్తుంది. కానీ ఇరాక్ లో ఉగ్రవాదుల చేతితో హతులైన భారతీయుల విషయంలో మాత్రం కేంద్రం ఎంత పరిహారం ప్రకటించిందన్న వివరాలు తెలియరాలేదు. ఇదే విషయమై కేంద్ర మంత్రిని అడిగిన మీడియాకు ఆయన కప్పదాటు సమాధానాలే ఇచ్చారు. మృతుల కుటుంబసభ్యులతో పాటు వారి విద్యార్హతలను తెలియజేస్తూ.. వివరాలను తమకు అందించాలని కోరామని, వారి అర్హతలమేరకు వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకు కూడా ప్రయత్నం చేస్తామన్నారు.
అయితే బాధిత కుటుంబాలకు ఉద్యోగాల కల్పన బాధ్యతను కేంద్రం తీసుకుంటుందా..? లేక రాష్ట్రం తీసుకోవాలా అన్న ప్రశ్నపై స్పందించిన ఆయన భారత దేశం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. అయితే ఎంత మేరకు పరిహారాన్ని ప్రకటిస్తున్నారు అన్న మీడియా ప్రశ్నలపై ఆయన స్పందిస్తూ.. ‘‘ఇదేమీ ఫుట్బాల్ ఆటకాదు. ఉద్యోగాలు ఇవ్వడం అంటే బిస్కెట్ల పంపిణీ కాదని తేల్చి చెప్పారు. ఇదేదో తన జేబులోంచి ఓ బాక్సు తీసి పరిహారాన్ని పంచాలంటే సాధ్యమయ్యే పనికాదని.. ఇది ప్రజల జీవితానికి సంబంధించిన విషయమని, ఈ విషయంలో తానెలా ప్రకటన చేస్తానని పేర్కొన్న మంత్రి, అసలు మీకు అర్థమవుతోందా? అంటూ మీడియాపైనే అసహనం వ్యక్తం చేశారు.
ఇరాక్ లో మృతి చెందిన 39 మందిలో 38 మంది భారతీయుల మృతదేహాలతో బాగ్దాద్ నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం సోమవారం మధ్యాహ్నం 2:30లకు అమృత్సర్ విమానాశ్రయానికి చేరుకుంది. మృతి చెందిన వారిలో మరొకరిని గుర్తించాల్సి ఉంది. 2014లో పని కోసం ఇరాక్ వెళ్లిన 40 మందిని మోసుల్లో ఉగ్రవాదులు అపహరించారు. అనంతరం వీరి చెర నుంచి ఒకరు తప్పించుకోగా మిగతా 39 మందిని ఉగ్రవాదులు హతమార్చారు. మొత్తం 40 మందిలో 27 మంది పంజాబ్కు చెందినవారు కాగా, మిగతావారు హిమాచల్ ప్రదేశ్ కు చెందినవారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more