దక్షిణాదిలో తమ పార్టీ నేతల అవినీతి, అక్రమార్జనలు, నాయకత్వ లోపంతో, నాయకుల మధ్య విభేధాలతో అధికారంలోకి వచ్చిన రాష్ట్రం కూడా చేజారడంతో.. మళ్లీ అదే రాష్ట్రంలో పాగా వేయాలని శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నా ఎన్నికల సర్వేలు మాత్రం అందుకు భిన్నంగా ఫలితాలను వెల్లడిస్తున్న నేపథ్యంలో ఏం చేద్దమని యోచనలో పడిన బీజేపీకి ఇప్పుడా అవకాశం కూడా పరిమితే అయ్యింది. మే 28వ తేదీతో కర్ణాటకలోని ప్రభుత్వ కాలపరిమితి ముగుస్తున్న క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో తక్షణం కార్ణటకలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కాగా ఎన్నికల తేదీలు ప్రకటించేందుకు ముందే లీక్ కావడంపై కొంత వివాదం కూడా నెలకొంది.
ఇక ఎన్నికల వివరాల్లోకి వెళ్తే.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలను మే 12వ తేదీన నిర్వహిస్తుండగా, 15న ఎన్నికల కౌంటింగ్ చేపట్టి ఫలితాలను వెల్లడిస్తామని ఈసీ ప్రకటించింది. మొత్తం 224 నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుపుతున్నట్టు పేర్కొంది. ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు వీవీపాట్ మెషీన్లను కూడా వినియోగించనున్నట్టు తెలిపింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఫొటోలను కూడా ఈవీఎంలకు జత చేస్తున్నామని... దీనివల్ల ఓటర్లు కన్ఫ్యూజన్ కు గురికాకుండా ఉంటారని వెల్లడించింది. పోలింగ్ బూత్ లలో మహిళల కోసం ప్రత్యేక వసతులు కల్పిస్తున్నామని... 450 పోలింగ్ స్టేషన్లను మొత్తం మహిళలే నిర్వహిస్తారని చెప్పింది. ఎన్నికల కోడ్ రాష్ట్రానికే కాకుండా, కేంద్ర ప్రభుత్వానికి కూడా వర్తిస్తుందని ఈసీ స్పష్టం చేసింది.
గత ఎన్నికల్లో కొన్ని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా సీఆర్పీఎఫ్ బలగాలను మోహరిస్తామని ఈసీ తెలిపింది. తమ ఓటు హక్కును నిర్భయంగా ఉపయోగించుకునేలా... బలహీనవర్గాల ఓటర్లకు పూర్తి రక్షణ కల్పిస్తామని చెప్పింది. ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చుకు సంబంధించి రూ. 28 లక్షలకు సీలింగ్ విధిస్తున్నామని తెలిపింది. ఈ ఎన్నికల్లో మొత్తం 4.96 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 2 కోట్ల, 51 లక్షల 79 వేల 219 మంది పురుష ఓటర్లు ఉండగా, 2 కోట్లచ 44 లక్షల 76 వేల 840 మంది మహిళా ఓటర్లు వున్నారని ఈసీ తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more