ప్రత్యేక హోదా అవసరం లేదు అని చెప్పిన వాళ్లు ఇవాళ అదే ప్రత్యేక హోదా కోసం ఏదో భగీరధ ప్రయత్నం చేస్తున్నట్లుగా అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ క్రమంలో అసెంబ్లీలోని ఏకైక ప్రతిపక్ష పార్టీ వైసీపి కూడా నామ్ కే వాస్తే పోరాటాలు చేసిందే తప్ప.. చిత్తశుద్దితో హోదా కోసం పోరాడింది మాత్రం లేదని ఆయన విమర్శించారు. ఏడాది కాలం జరిగిన తరువాత తాను టీడీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో అడగకుండా ఏం చేస్తున్నారని.. ఎంపీలుగా రాష్ట్రం కోసం ఏం చేస్తున్నారని, స్వప్రయోజనాలు, వ్యాపారాలను అపి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని తాను నిలదీశానని అన్నారు పవన్.
అప్పుడు తనతో చర్చించిన ప్రభుత్వ తరపు వర్గాలు.. తొలి సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు జరిగిన తరువాత చూద్దమని, అప్పుడే వద్దని అన్నారని అలా.. ఒకటి, రెండు సంవత్సరాలు గడిచిన తరువాత.. 2016లో తిరుపతి సభలో అడిగితే ప్రత్యేక హోదా అవసరం లేదని అన్నది ఎవరని ఆయన ప్రశ్నించారు. ఆ తరువాతు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని.. వాదించింది ఎవరు..? కాకినాడ సభకు ముందు అర్థరాత్రి హైడ్రామాలో భాగంగా ప్యాకేజీ ప్రకటించి.. దాని బేష్ హోదాతో కూడా సాధ్యం కాని అవసరాలు ప్యాకేజీతో తీరుతాయని అన్నది ఎవరని ప్రశ్నించారు. అయితే ప్యాకేజీకి చట్టబద్దత లేదని తాము ప్రశ్నిస్తే తమ అది కూడా త్వరగానే చేస్తామని చెప్పింది ఎవరని కూడా పవన్ ప్రశ్నించారు.
ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరగాల్సిన అంశాన్ని కేంద్రంతో సంబంధం లేని వ్యక్తులు, కేవలం పార్టీతో సంబంధమున్న వ్యక్తులు మాత్రమే చెబితే వాటిపై ఎలా స్పందిస్తామని, అసలు ఆయనను ఏ హోదాలో ఈ లేఖ రాశారని పరిగణించాల్సిన అవసరం వుందని పవన్ కల్యాన్ అన్నారు. ఇక రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం పజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించిందని అన్నారు. ఉత్తరాంధ్రలో పుట్టిన బిడ్డలు చనిపోతున్నా.. పట్టించుకోలేదని అరోపించారు. అయితే వేల కోట్ల ప్రజాధనాన్ని పుష్కరాలకు ఖర్చుచేయడమేంటని పవన్ కల్యాన్ ప్రశ్నించారు.
రైతులు గిట్టుబాటు ధరలు కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం కనీసం వారికి అండగా వుంటామన్న భరోసాను కూడా కల్పించలేకపోయిందని అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారన్నారు. రాజధాని నిర్మాణం.. సహా అన్ని అంశాల్లో టీడీపీ వైఫల్యం చెందిందని పవన్ కల్యాన్ విమర్శించారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలను సేకరించిన ప్రభుత్వం అందులో ఎవరెవరకి ఎక్కడ అన్న కేటాయింపులు కూడా ఇప్పటికీ చేయలేదని అన్నారు. ఇక నాలుగేళ్ల పాటు బీజేపి అన్ని రకాలుగా సహకరించిన టీడీపీ.. ఇప్పుడు తామే పోరాటం చేస్తున్నట్లు ప్రజలను మభ్యపెడుతుందని, ప్రత్యేక హోదాతో లాభమే లేదన్నవాళ్లు.. ఇప్పుడెందుకు దాని కోసం తాము పోరాటం చేస్తున్నామని అసెంబ్లీలో ప్రగల్భాలు పలుకుతున్నారని పవన్ కల్యాన్ ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more