అవినీతి రహిత భారత్ సాధనే తన ధ్యేయంగా పెట్టుకున్న సామాజిక కార్యకర్త అన్నా హజారే.. ఢిల్లీలోని చారిత్రక రామ్ లీలా మైదానంలో ఇవాళ ఉదయం నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. ఢిల్లీలోని చరిత్రాత్మక రామ్లీలా మైదానంలో దీక్ష ప్రారంభమైంది. కేంద్రంలో లోక్ పాల్ బిల్లు అమలు, రాష్ట్రాల్లో లోకాయుక్త నియామకం, దేశవ్యాప్తంగా రైతులను ఆదుకోవడం కోసం స్వామినాథన్ సిఫారస్సులు అమలు చేయాలన్న మూడు డిమాండ్ లతో ఆయన ఈసారి నిరాహార దీక్ష చేపట్టారు. 2011లో ఆయన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ఆయన ఇక్కడి నుంచే నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇవాళ ఉదయం ముందుగా రాజ్ఘాట్లో మహాత్మా గాంధీ సమాధి వద్దకు చేరుకున్న అన్నా హజారే ఆయనకు ఘననివాళులర్పించారు. ఆ తరువాత ఆయన దేశ భక్తులు, త్యాగధనులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల బలిదానాలను ఆయన గుర్తుచేసుకున్నారు. బ్రిటిష్ పరిపాలకులు మార్చి 23న ఉరి తీసిన నేపథ్యంలో వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ.. తన నిరవధిక నిరాహార దీక్షకు ఈరోజును ఎంపిక చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. తన మద్దతుదారులు ఢిల్లీకి తరలి రాకుండా అడ్డుకునేందుకు రైళ్ళను రద్దు చేశారని ఆరోపించారు. హింసకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నారన్నారు. తన చుట్టూ పోలీసు బలగాలను మోహరించారన్నారు. తనకు పోలీసు రక్షణ అవసరం లేదని తాను చాలాసార్లు లేఖలు రాసినట్లు తెలిపారు. మీరు కల్పించే భద్రత నన్ను కాపాడబోదని చెప్పానన్నారు. ప్రభుత్వ వైఖరి సరైనది కాదని దుయ్యబట్టారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం లోక్ పాల్ బిల్లును అమలు చేసేంత వరకు నిరవధిక నిరాహారదీక్ష కొనసాగిస్తానని ఆయన అన్నారు. రాష్ట్రాల్లో లోకాయుక్తాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతులే ఈ దేశానికి వెన్నుముక్క అని చెబుతున్న ప్రభుత్వం వారి సంక్షేమం కోసం మాత్రం పాటుపడటం లేదని అన్నారు. అయితే గత నాలుగేళ్లుగా తాను ప్రధాన మంత్రి మోడీకి రాసీన ఎన్నో లేఖలకు ఇప్పటివరకూ సమాధానమే రాలేదని, ఈ క్రమంలో తాను ఈ మూడు డిమాండ్లను కేంద్రం ఎదుట పెట్టి నిరాహారదీక్షకు పూనుకున్నట్లు చెప్పారు.
You cancelled trains carrying protesters to #Delhi, you want to push them to violence. Police Force deployed for me as well. I wrote in many letters that I don't need police protection. Your protection won't save me. This sly attitude of the government is not done: Anna Hazare pic.twitter.com/Ue91oXsnzG
— ANI (@ANI) March 23, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more